Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందబోతున్న విషయం విదితమే. గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకాలపై అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ(చినబాబు) సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం శనివారం ఉదయం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. అల్లు అర్జున్కిది 19వ చిత్రం. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుంది. ''జులాయి', 'సన్నాఫ్ సత్యమూర్తి' చిత్రాల విజయాల తర్వాత ముచ్చటగా మూడోసారి బన్నీ, త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై అటు సినీ వాణిజ్య వర్గాల్లోనూ, ఇటు ప్రేక్షకుల్లోనూ అంచనాలు ఉన్నత స్థాయిలో ఉన్నాయి. వాటిని నిజం చేసే దిశగా నిర్మాతలు ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు' అని చిత్ర బృందం తెలిపింది. 'ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. ఈ నెల 24 నుంచి రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్లో ప్రారంభమవుతుంది' అని నిర్మాతలు చెప్పారు. టబు, సత్యరాజ్, రాజేంద్రప్రసాద్, సునీల్, నవదీప్, బ్రహ్మాజీ, రావు రమేష్, మురళీ శర్మ, రాహుల్ రామకృష్ణ, ప్రత్యేక పాత్రలో సుశాంత్ నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: పి.ఎస్.వినోద్, సంగీతం: థమన్, ఎడిటింగ్: నవీన్ నూలి. ఆర్ట్: ఏ.ఎస్.ప్రకాష్.