Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పెళ్ళి తర్వాత ప్రియాంక చోప్రా నెమ్మదిగా కొత్త ప్రాజెక్ట్ల విషయంలో స్పీడ్ పెంచుతున్నారు. ప్రస్తుతం బాలీవుడ్లో 'ది స్కై ఈజ్ పింక్' చిత్రంలో నటిస్తున్నారు. తాజాగా ఓ కొత్త హాలీవుడ్ చిత్రానికి సైన్ చేశారట. హాలీవుడ్ నిర్మాత మైండీ కాలింగ్ నిర్మించే నయా చిత్రంలో ప్రియాంక కథానాయికగా ఎంపికైంది. వెడ్డింగ్ కామెడీగా ఈ సినిమా సాగుతుందట. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. ఆగస్ట్ వరకు ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి, ఆ వెంటనే షూటింగ్ ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాని ప్రధానంగా ఇండియా, ఆమెరికాలో చిత్రీకరించనున్నారు. ఇండియన్ వెడ్డింగ్ కల్చర్ని ఎక్స్పోజ్ చేస్తూ ఈ సినిమా ఉంటుందట. అందుకే ఢిల్లీ, రాజస్థాన్ వంటి ప్రాంతాల్లో చిత్రీకరించనున్నారు. అందుకోసం చిత్ర బృందం ఇండియాలో లొకేషన్లు వెతికే పనిలో ఉంది. ఈ సందర్భంగా ప్రియాంక, మైండీ కలిసి దిగిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ప్రస్తుతం ప్రియాంక నటిస్తున్న 'ది స్కై ఈజ్ పింక్'కి సోనాలి బోస్ దర్శకత్వం వహిస్తుండగా, ఫర్హాన్ అక్తర్ హీరోగా, జైరా వసీమ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. మోటివేషనల్ స్పీకర్ ఆయేషా చౌదరి జీవితం ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమా ఆగస్ట్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.