Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వరలక్ష్మి, కేథరిన్, లక్ష్మిరారు ప్రధాన పాత్రధారులుగా జై హీరోగా నటిస్తున్న చిత్రం 'నాగకన్య'. ఎస్.సురేష్ దర్శకత్వంలో జంబో సినిమాస్ పతాకంపై ఏ.శ్రీధర్ నిర్మిస్తున్నారు. మే 10న సినిమాని విడుదల చేయనున్నట్టు తాజాగా చిత్ర బృందం ప్రకటించింది.
ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ, 'ఇటీవల విడుదలైన ప్రధాన పాత్రధారుల లుక్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. భిన్నమైన కాన్సెప్ట్తో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రతి సీన్ ఉత్కంఠ రేకెత్తిస్తుంది. ట్రైలర్కి అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో క్రేజ్ బాగా పెరిగింది. జై పాత్ర సినిమాకి మరో హైలైట్గా నిలుస్తుంది. దర్శకుడు సురేష్ కథ, స్క్రీన్ప్లే క్యూరియాసిటీ రేకెత్తిస్తుంది. గ్రాఫిక్స్ అబ్బురపరుస్తాయి. విభిన్నమైన ప్రమోషన్స్తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం. వరలక్ష్మి శరత్ కుమార్, కేథరిన్, రారు లక్ష్మి పాత్రలు ఊహించని విధంగా ఉంటాయి. ప్రతి పాత్రకి మంచి పేరొస్తుంది. వేసవి కానుకగా సినిమాని విడుదల చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. వేసవిలో పిల్లలతో పాటు పెద్దలు కూడా సినిమాని చూసి ఎంజారు చేసే విధంగా ఉంటుంది' అని చెప్పారు.