Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మహేష్బాబు, పూజా హెగ్డే జంటగా వంశీపైడిపల్లి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ సినిమా, వైజయంతి మూవీస్ పతాకాలపై దిల్రాజు, పీవీపీ, అశ్వనీదత్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'మహర్షి'. శరవేగంగా చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమా గురువారంతో చిత్రీకరణ మొత్తం పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం కేట్ కట్ చేసుకుని సెలబ్రేట్ చేసుకున్నారు.
ఈ విషయాన్ని దర్శకుడు వంశీపైడిపల్లి ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. ఇదిలా ఉంటే, ఇటీవల విడుదలైన టీజర్, రెండు పాటలకి మంచి స్పందన లభించింది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలోని 'ఎవరెస్ట్ అంచున..' అంటూ సాగే మూడో పాటని నేడు(శుక్రవారం) విడుదల చేయనున్నారు. ఇందులో మహేష్బాబు రిషి పాత్రలో నటిస్తున్నారు. అతని జర్నీని తెలిపే విధంగా ఈ సినిమా ఉంటుందని ఇటీవల చిత్ర బృందం తెలియజేసిన విషయం విదితమే. ఇందులో అల్లరి నరేష్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాని మే 9న గ్రాండ్గా వరల్డ్వైడ్గా విడుదల చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. మహేష్ నటిస్తున్న 25వ చిత్రం కావడం, విడుదలైన టీజర్, పోస్టర్లు అందరినీ విశేషంగా అలరిస్తుండటంతో ఈ సినిమాపై సర్వత్రా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో విడుదలవ్వబోతున్న 'మహర్షి' సినిమా అందరి అంచనాలను అందుకుంటుందో లేదో సినిమా విడుదల వరకు వేచి చూద్దాం.