Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విభిన్నమైన పాత్రలతో మెప్పించి జాతీయ ఉత్తమ నటిగా అవార్డునందుకున్న ప్రియమణి రీఎంట్రీ ఇస్తూ 'సిరివెన్నెల' చిత్రంలో నటిస్తున్నారు. ప్రకాష్ పులిజాల దర్శకత్వంలో ఏ ఎన్ బి కోర్డినేటర్స్, శాంతి టెలీఫిలిమ్స్ బ్యానర్ పై కమల్ బోరా, ఏ ఎన్ భాషా, రామ సీత సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర టీజర్ని బాలీవుడ్ దర్శకుడు నీరజ్ పాండే విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ, 'ప్రియమణి చాలా కథలు విన్నప్పటికీ 'సిరివెన్నెల' కథ బాగా నచ్చడం, నటనకి స్కోప్ ఉన్న పాత్ర కావడంతో ఒప్పుకున్నారు. ప్రియమణికిది సరైన సెకండ్ ఇన్నింగ్స్ చిత్రంగా నిలుస్తుంది. మా బ్యానర్కి మంచి పేరు తీసుకొచ్చే చిత్రమవుతుంది. 'సిరివెన్నెల' అనే టైటిల్ మా సినిమాకు పర్ఫెక్ట్ యాప్ట్. క్లాసిక్ టైటిల్ని ప్రకటించినప్పట్నుంచి ఇండిస్టీ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. షూటింగ్ పూర్తయ్యింది. శివరాత్రి సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్కి మంచి స్పందన లభించింది. తాజా టీజర్కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ప్రియమణి నట విశ్వరూపం ఇందులో మరోసారి చూడబోతున్నాం. ఆమె కెరీర్లో డిఫరెంట్ సినిమాగా నిలవనుంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్ని కూడా శరవేగంగా పూర్తి చేస్తున్నాం. త్వరలోనే రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేస్తాం. ఇందులో జూనియర్ 'మహానటి'గా మంచిపేరు తెచ్చుకున్న సాయి తేజస్విని, కాలకేయ ప్రభాకర్, సీనియర్ నటుడు అజరు రత్నం, రాకెట్ రాఘవ తదితరులు కీలక పాత్రల్లో నటించారు' అని అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: కళ్యాణ్ సమి, ఎడిటర్: నాగేశ్వర్రెడ్డి, సంగీతం: ఏఎన్బీ కోఆర్డినేటర్స్ మ్యూజిక్ ప్రొడక్షన్ కంపెనీ.