Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'శ్రీమంతుడు' నుంచి కథల ఎంపికలో మహేష్బాబు పంథా మార్చారు. వినోదం, ఎమోషన్స్, సందేశం మేళవించిన భిన్నమైన కథలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం వంశీపైడిపల్లి దర్శకత్వంలో 'మహర్షి' చిత్రంలో నటిస్తున్నారు. అనంతరం 'ఎఫ్2'తో బ్లాక్ బస్టర్ అందుకున్న అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. దిల్రాజు నిర్మించే ఈ సినిమా త్వరలోనే పట్టాలెక్కనుందని తెలుస్తుంది. ఇదిలా ఉంటే 'గీత గోవిందం' వంటి బ్లాక్ బస్టర్ని అందుకున్న పరుశురామ్ సైతం మహేష్ హీరోగా ఓ సినిమా చేయాలని భావిస్తున్నారట. ఈ ప్రాజెక్ట్ని గీతా ఆర్ట్స్లో నిర్మించాలని అల్లు అరవింద్ ప్లాన్ చేస్తున్నట్టు ఓ వార్త తాజాగా సామాజిక మాద్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఆరోగ్యకరమైన హాస్యం, మనసుని హత్తుకునే అనుబంధాలు, భావోద్వేగాలు, అందమైన ప్రేమకథ సమాహారంగా సినిమాలను తెరకెక్కించడంలో పరుశురామ్ దిట్ట. ఈ నేపథ్యంలో ఆయనతో సినిమా చేసి ఫ్యామిలీ ఆడియెన్స్కి మరింత దగ్గరవ్వాలని మహేష్ కూడా భావిస్తున్నారట. మరోవైపు 'అర్జున్రెడ్డి' ఫేమ్ సందీప్రెడ్డి వంగా, కొరటాల శివ, త్రివిక్రమ్ వంటి వారితోనూ సినిమాలుంటాయని గతంలో వార్తలు వినిపించాయి. ఇలా దర్శకుల క్యూ చాలానే ఉంది. మరి వీటిలో ఎవరితో ఎప్పుడు ఉంటుంది? అసలు ఉంటాయా? లేదా అనేది తేలాలంటే 'మహర్షి' విడుదల వరకు ఆగాల్సిందే. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వైజయంతి మూవీస్, శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, పి.వి.పి సినిమా పతాకాలపై రూపొందుతున్న 'మహర్షి' చిత్రీకరణ పూర్తి చేసుకుంది. మహేష్ సరసన పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. అల్లరి నరేష్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన 'ఛోటి ఛోటి ఛోటి బాతే.. ', ''నువ్వే సమస్తం.. నువ్వే సిద్ధాంతం....నువ్వే నీపంతం, నువ్వేలే అనంతం' పాటలకు కూడా అద్భుతమైన స్పందన వస్తోంది. 'ఎవరెస్ట్ అంచున పూసిన రోజా పువ్వే ఓ చిరునవ్వే విసిరిందే..' అంటూ సాగే సాంగ్ వీడియో ప్రివ్యూని శుక్రవారం విడుదల చేశారు.
ఈ సందర్భంగా చిత్ర బృందం మాట్లాడుతూ, 'శ్రీమణి ఈ పాటని రాయగా, దేవిశ్రీప్రసాద్ సంగీతం సమకూర్చారు. చక్కని బీట్తో సాగే ఈ పాటలో
మహేష్, పూజా హెగ్డే వేసిన స్టెప్స్కి అభిమానులు ఫిదా అవుతారనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి మే 9న సమ్మర్ స్పెషల్గా ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం' అని తెలిపింది.