Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విజరు, మమత, రిషివర్మ, సుహాసన ప్రధాన పాత్రధారులుగా రాజా విక్రమ నరేంద్ర దర్శకత్వంలో ఆర్.పి సమర్పణలో అను ఫిల్మ్ బ్యానర్పై రామమోహన్ నాగుల, ఎం.ప్రవీణ్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'అమృత నిలయం'. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం గురించి చిత్ర దర్శకుడు మాట్లాడుతూ, 'ప్రస్తుత సమాజంలో తాగిన మైకంలో యువత చేసే పొరపాట్ల వల్ల చాలా కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. అలాంటి కుటుంబాల్లో ఓ అంధుడి జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం' అని అన్నారు. 'వైజాగ్లో ఎక్కువ శాతం చిత్రీకరించాం. సింగిల్ షెడ్యూల్లో సినిమా పూర్తయింది. నిర్మాణానంతర కార్యక్రమాలు తుదిదశలో ఉన్నాయి. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసి సినిమాని విడుదల చేస్తాం' అని నిర్మాతలు చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: రాం.