Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ఆరుగురు అమ్మాయిలు... ఆరు ప్రేమకథలు! ప్రతి ప్రేమ కథలోనూ అబ్బాయి ఒక్కడే! ఆరుగురు అమ్మాయిలను ఒకేసారి ప్రేమిస్తున్న అతడు మంచోడా? చెడ్డోడా? ప్రతి అమ్మాయి అతడే కావాలని ఎందుకు కోరుకుంటోంది? అనేది తెలియాలంటే 'సెవెన్' సినిమా చూడాల్సిందే అంటున్నారు నిర్మాత రమేష్ వర్మ. హవీష్ హీరోగా, రెజీనా, నందితా శ్వేత, అనీషా ఆంబ్రోస్, త్రిధా చౌదరి, అదితి ఆర్య, పూజితా పొన్నాడ కథానాయికగా నటిస్తున్న చిత్రం 'సెవెన్'.
నిజార్ షఫీ దర్శకత్వంలో కిరణ్ స్టూడియోస్ పతాకంపై రమేష్ వర్మ ప్రొడక్షన్లో రమేష్ వర్మ నిర్మించడంతోపాటు కథ అందించారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఏప్రిల్ నాలుగో వారంలో సినిమాలోని తొలి పాటను విడుదల చేయనున్నారు. ఆ విశేషాలని నిర్మాత రమేష్ వర్మ తెలియజేస్తూ, 'ఇదొక రొమాంటిక్ థ్రిల్లర్ డ్రామా. సినిమా చాలా బాగా వచ్చింది. స్క్రీన్ ప్లే కొత్తగా ఉంటుంది. ప్రేక్షకుల ఊహలకు అందని మలుపులతో కథనం సాగుతుంది. ప్రతి ట్విస్ట్ ప్రేక్షకులను సర్ప్రైజ్ చేస్తుంది. ప్రతి మలుపు వెనుక కథలో భాగంగా ఎమోషనల్ లవ్ స్టోరీ ఉంటుంది. ఏప్రిల్ నాలుగో వారంలో హవీష్, రెజీనాపై తెరకెక్కించిన తొలి పాటను విడుదల చేస్తున్నాం. మేలో సినిమాను విడుదల చేస్తాం' అని చెప్పారు.