Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అలీ, ధన్రాజ్, సుమన్ శెట్టి, హీన, షేకింగ్ శేషు, జబర్దస్త్ అప్పారావు ప్రధాన పాత్రధారులుగా ఎస్.శ్యామ్ ప్రసాద్ దర్శకత్వంలో కిషోర్ రాఠి సమర్పణలో మనీషా ఆర్ట్స్ అండ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై మహేష్ రాఠి నిర్మిస్తున్న చిత్రం 'రంగుపడుద్ది'. ఈ చిత్ర టీజర్ని శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా నటుడు ధన్ రాజ్ మాట్లాడుతూ, 'అప్పట్లో ఇదే బ్యానర్లో వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం 'ఘటోత్కచుడు'లోని 'రంగుపడుద్ది..' డైలాగ్నే టైటిల్గా పెట్టి ఓ మంచి కామెడీ హారర్ను తెరకెక్కిస్తున్నారు. రెండు గ్యాంగ్ల మధ్య జరిగే గొడవ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. దాన్నే ఔట్ అండ్ ఔట్ కామెడీతో తెరకెక్కించారు దర్శకుడు శ్యామ్ ప్రసాద్. 'యమలీల' చిత్రంలో 'చినుకు చినుకు' పాటను మళ్లీ ఇప్పుడు అప్పారావుకు, హీరోయిన్కి మధ్య కంపోజ్ చేశారు. అప్పటి మ్యాజిక్ మరోసారి రిపీట్ అవుతుందని భావిస్తున్నా. మే మొదటి వారంలోగాని, రెండో వారంలోగాని ఈ సినిమా విడుదల కానుంది' అని అన్నారు. 'చాలా కాలం తరువాత ఇదే బ్యానర్లో సినిమా చేయడం ఆనందంగా ఉంది. ఒక బంగ్లాలో రెండు గ్యాంగ్ల మధ్య చోటు చేసుకునే ఘర్షణే చిత్ర కథాంశం. పూర్తి స్థాయి హారర్ కామెడీతో తెరకెక్కిన ఈ చిత్రం అందర్నీ అలరిస్తుందని ఆశిస్తున్నా' అని దర్శకుడు ఎస్.శ్యామ్ప్రసాద్ చెప్పారు. నిర్మాత మహేష్ రాఠి చెబుతూ, 'క్లాస్, మాస్, ఫ్యామిలీస్తో పాటు చిన్న పిల్లల్ని సైతం ఎంటర్టైన్ చేస్తుంది' అని తెలిపారు.