Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'స్పైడర్' తర్వాత తెలుగు సినిమాలకు దూరంగా ఉన్న రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవల 'ఎన్టీఆర్' బయోపిక్లో శ్రీదేవిగా మెరిసింది. తాజాగా వరుసగా మళ్ళీ తెలుగు ప్రాజెక్ట్కి సైన్ చేస్తూ స్పీడ్ పెంచుతోంది. ప్రస్తుతం తెలుగులో నాగార్జున 'మన్మథుడు 2'లో నటిస్తుంది. పోర్చుగల్లో జరుగుతున్న ఈ చిత్ర షూటింగ్లోనూ పాల్గొంటుంది. తాజాగా మరో తెలుగు ప్రాజెక్ట్కి సైన్ చేసిందట. నితిన్ సరసన నటించేందుకు గ్రీన్ సిగల్ ఇచ్చినట్టు ఓ వార్త సామాజిక మాద్యమాల్లో వైరల్ అవుతుంది. నితిన్ ప్రస్తుతం 'భీష్మ'లో నటిస్తున్నారు.
ఆ తర్వాత చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నట్టు ఇటీవల ప్రకటించారు.
ఇందులో కథానాయికగా రకుల్ని ఎంపిక చేసే ఆలోచనలో చిత్ర బృందం ఉందట. ఇదే సెట్ అయితే నితిన్, రకుల్ జోడీకి సైతం తొలి చిత్రమే అవుతుంది. రకుల్ హిందీలో 'దే దే ప్యార్ దే'లో అజరు దేవగన్ సరసన నటిస్తుంది. దీంతోపాటు 'మర్జావాన్', తమిళంలో 'ఎన్జీకే', శివకార్తికేయన్ సినిమాలో నటిస్తూ అటు తమిళం, ఇటు తెలుగు, మరోవైపు హిందీ ప్రాజెక్ట్లతో వరుసగా చైన్నై టు
హైదరాబాద్ టు ముంబయికి చక్కర్లు కొడుతోంది.