Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు బి.ఎ సమర్పణలో సుచేత డ్రీమ్ వర్క్స్ బ్యానర్పై విశ్వాస్ హన్నుర్కర్ నిర్మాతగా ఓ సినిమా రూపొందుతుంది. రాఘవేంద్ర వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో 'ఈనగరానికి ఏమైంది' ఫేమ్ సాయిసుశాంత్, సిమ్రాన్ చౌదరి, చాందిని చౌదరి హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. శనివారం ఈ సినిమా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి కె.రాఘవేంద్రరావు కెమెరా స్విచ్ఛాన్ చేసి గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా నిర్మాత విశ్వాస్ హన్నుర్కర్ మాట్లాడుతూ, 'కామెడీ, ఫాంటసీ నేపథ్యంలో సాగే చిత్రమిది.
సాయి సుశాంత్ రెడ్డి, చాందిని చౌదరి, సిమ్రాన్ చౌదరి సహా మంచి ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణులతో తెరకెక్కిస్తున్నాం. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను తెలియజేస్తాం' అని చెప్పారు. తనికెళ్ళ భరణి, ప్రియదర్శి, మకరంద్ దేశ్ పాండే, శిశిర్ శర్మ, ఝాన్సీ, వినీత్ కుమార్ ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సతీష్, సంగీతం: జోష్.బి, ఎడిటింగ్: గౌతంరాజు, ఆర్ట్: శ్రీకాంత్ రామిశెట్టి.