Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మంచు విష్ణుకి గత మూడేండ్లుగా సక్సెస్ లేదు. చివరగా 'ఈడో రకం ఆడో రకం'తో విజయాన్ని అందుకున్నారు. దర్శకుడు శ్రీనువైట్లకి సక్సెస్ దూరమై ఎనిమిదేండ్లు అవుతుంది. చివరగా 'దూకుడు'తో హిట్నందుకున్నారు. ఇప్పుడు ఈ ఇద్దరు కలిసి ఓ సినిమా చేస్తున్నారు. దాదాపు 12ఏండ్ల తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమా రాబోతుండటం ఓ విశేషమైతే, గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన 'ఢ'కి సీక్వెల్గా నయా సినిమా చేయబోతుండటం మరో విశేషం. 2007లో ఫ్యామిలీ డ్రామాగా వచ్చిన 'ఢ' ఘన విజయం సాధించింది. సక్సెస్ కోసం ఆ సినిమాకి సీక్వెల్ని రూపొందించాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇది మల్టీస్టారర్గా ఉండబోతుందట. ఇప్పుడు మల్టీస్టారర్ల ట్రెండ్ సాగుతుండటం, మంచు విష్ణు మార్కెట్ పడిపోవడం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని దీన్ని మల్టీస్టారర్గా తెరకెక్కించాలని భావిస్తున్నారు. ప్రస్తుతం మరో హీరోని ఫైనల్ చేసే పనిలో ఉన్నారు.