Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సాయిధరమ్ తేజ్, కల్యాణి ప్రియదర్శన్, నివేదా పేతురాజ్ హీరోహీరోయిన్లుగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, సి.వి.ఎం (మోహన్) నిర్మించిన చిత్రం 'చిత్రలహరి'. ఇటీవల విడుదలైన సినిమాకి పాజిటివ్ టాక్ వస్తున్న నేపథ్యంలో శుక్రవారం గ్రాండ్ సక్సెస్మీట్ని ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా హీరో సాయితేజ్ మాట్లాడుతూ, 'సినిమాకి బాగా కలెక్షన్స్ వచ్చాయని అంటున్నారు, కానీ నా దృష్టిలో సినిమా ఆడియెన్స్కి బాగా దగ్గర కావడమే సక్సెస్గా భావిస్తా. ఎంతో మంది సక్సెస్ కోసం కష్టపడుతున్నారు. అదే బిగ్గెస్ట్ సక్సెస్గా భావిస్తున్నా. ఇది నా ఒక్కడి సక్సెస్ కాదు. నా టీంతో పాటు సినిమాను చూసి ఇన్స్పైర్ అయిన ప్రతి ఒక్కరికీ ఈ సక్సెస్ చెందుతుంది. కలల కోసం ఫైట్ చేయండి. ఇది జరగదు అని ఎంత చెప్పినా వినకండి. మీపై మీరు నమ్మకం ఉంచి, పోరాడితే కచ్చితంగా సక్సెస్ దక్కుతుంది. నాకు ఈ ఛాన్స్ ఇచ్చిన నిర్మాతలు, దర్శకుడు కిషోర్కి, కల్యాణి ప్రియదర్శన్, నివేదా పేతురాజ్లకు థ్యాంక్స్. దేవిశ్రీప్రసాద్ బ్యూటీఫుల్ ట్యూన్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. నా గ్లాస్మేట్స్ సునీల్ అన్న, హైపర్ ఆది, సుదర్శన్ చాలా కంఫర్ట్ ఇచ్చారు. నాకు పోసాని అంటే చాలా ఇష్టం. ఆయన పాత్రలో మా అమ్మను చూసుకున్నాను. సక్సెస్కి కారణమైన మెగాఫ్యాన్స్ అందరికీ కృతజ్ఞతలు' అని అన్నారు. 'సినిమాలో తేజుని చూసినప్పుడు రియల్ లైఫ్లోనూ నాకు తేజునే గుర్తొచ్చాడు. అప్పటికి తన ఫస్ట్ సినిమా కంప్లీట్ కాలేదు. డిస్ట్రబ్గా ఉన్నప్పుడు 'కేరింత' సినిమా చేద్దామని తేజుని పిలిచాను. అప్పుడు తన ఫేస్లో కనిపించిన ఆనందం, ఈ సినిమా క్లైమాక్స్ తర్వాత తన ఫేస్లో కనపడింది. తేజుకి మంచి సక్సెస్ రావడం చాలా హ్యపీగా ఉంది. దీన్ని ఇలాగే కొనసాగించాలి. డైరెక్టర్ కిషోర్ తిరుమల సింపుల్ క్యారెక్టర్స్ను తీసుకుంటూ దాన్ని హీరోలకు అడాప్ట్ చేస్తూ సింపుల్గా సినిమాలను తెరకెక్కిస్తున్నాడు. తనకు ఆల్ ది బెస్ట్. తన స్టామినాకి తగ్గ హిట్ రాలేదని భావిస్తున్నా. మైత్రీ నిర్మాతలు ఎంతో అదృష్టవంతులు. ఇండిస్టీకి రాగానే మూడు బ్లాక్ బస్టర్స్ సాధించారు. అది ఎవరికీ సాధ్యం కాదు. చిన్న స్పీడ్ బ్రేకర్ను దాటి మళ్లీ సక్సెస్ బాట పట్టారు. యూనిట్ అందరికి అభినందనలు' అని దిల్రాజు చెప్పారు. సునీల్ మాట్లాడుతూ, 'మంచి పాత్ర ఇచ్చి దర్శక, నిర్మాతలకి, ఆదరించిన ఆడియెన్స్కి థ్యాంక్స్' అని చెప్పారు. 'సినిమాకు పనిచేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు ధన్యవాదాలు' అని దర్శకుడు కిషోర్ తిరుమల తెలిపారు. ఈ కార్యక్రమంలో చంద్రబోస్, పోసాని, నిర్మాతలు పాల్గొని తమ సంతోషాన్ని పంచుకున్నారు.