Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉదరు శంకర్, ఐశ్వర్య రాజేష్ జంటగా ఎస్.వి.నిర్మల్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'మిస్ మ్యాచ్'. క్రియేటివ్ సైన్స్ ఎల్.ఎల్.పి పతాకంపై జి. శ్రీరామ్ రాజు, భరత్రామ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ని ఇటీవల దర్శకుడు క్రిష్ విడుదల చేశారు. ఈ సందర్భంగా క్రిష్ మాట్లాడుతూ, 'దర్శకుడు నిర్మల్ నాకు మంచి మిత్రుడు. ఆయన మేకింగ్ గురించి 'డా||సలీం'తోనే అర్థమైంది. ఈ సినిమా అంతకు మించిన విజయాన్ని సాధిస్తుందనుకుంటున్నా. దీనికి రచయిత భూపతి రాజా. ఆనాటి 'ముఠామేస్త్రి' నుండి ఇప్పటి 'సైరా నరసింహారెడ్డి' వరకు ఆయన రాసిన సినిమాలు మనం చూస్తూనే ఉన్నాం. సినిమాటోగ్రాఫర్ గణేష్, నిర్మాతలు ఇలా అంతా నాకు తెలిసిన వాళ్ళే. ఉదరు శంకర్ నటించిన 'ఆట గదరా శివ' మంచి విలువలు కలిగిన చిత్రం. ఈ సినిమాకి పనిచేస్తున్న ప్రతి ఒక్క నటీనటులు, టెక్నీషియన్లకు థ్యాంక్స్' అని అన్నారు. 'క్రిష్ మా చిత్ర ఫస్ట్లుక్ని విడుదల చేయడం హ్యాపీగా ఉంది. తెలుగులో నాకిది తొలి చిత్రం. ఛాన్స్ ఇచ్చిన నిర్మాతలకు థ్యాంక్స్. భూపతిరాజా అందించిన కథ ఆకట్టుకుంటుంది. 'డా||సలీం' చిత్రాన్ని ఎలా ఆదరించారో, ఈ సినిమాని కూడా ఆదరించి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నా' అని చిత్ర దర్శకుడు నిర్మల్ కుమార్ చెప్పారు. చిత్ర కథా రచయిత భూపతిరాజా మాట్లాడుతూ, 'మా మాటని మన్నించి ఈ చిత్రం తొలి ప్రచార చిత్రాన్ని విడుదల చేసిన దర్శకులు క్రిష్కి ధన్యవాదాలు. ఓ కొత్తరకమైన కంటెంట్తో ఈ సినిమా రాబోతుంది' అని చెప్పారు. 'ఈ సినిమా స్క్రిప్ట్ విన్నప్పుడే బాగా నచ్చింది. అనుకున్నట్టుగానే స్క్రిప్ట్ పరంగా సినిమా బాగా వస్తోంది' అని హీరో ఉదరు శంకర్ చెప్పారు.
నిర్మాతలలో ఒకరైన జి.శ్రీరామ్ రాజు మాట్లాడుతూ, 'ఒక మంచి కథాబలం ఉన్న సినిమాతో నిర్మాత అవుతున్నందుకు సంతోషంగా ఉంది' అని అన్నారు. 'మా అందరికి గురువు, మేము నమ్మే వ్యక్తి శ్రీరామ్ సార్ వల్లే మేము ఇక్కడ ఉన్నాం. ఆయన అబ్బాయే హీరో ఉదరు శంకర్. ఈ సినిమా మంచి సక్సెస్ అవుతుందని భావిస్తున్నాం' అని మరో నిర్మాత భరత్ రామ్ అన్నారు.