Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ ఏడాది తెలుగులో 'జెర్సీ', తమిళంలో 'కె13' చిత్రాలు సాధించిన బ్యాక్ టు బ్యాక్ సక్సెస్లతో
కథానాయిక శ్రద్ధాశ్రీనాథ్కు రెండు భాషా పరిశ్రమల నుంచి ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. 'జెర్సీ' చిత్రంలో నాని సరసన నటించిన శ్రద్ధాకి నటన పరంగా ప్రేక్షకుల దగ్గర్నుంచి మంచి మార్కులే వచ్చాయి. 2015లో మాలీవుడ్లో రూపొందిన 'కోహినూర్' చిత్రంతో తెరంగేట్రం చేసిన శ్రద్ధా ఆ తర్వాత 'యు టర్స్', 'ముంగారుమాలై', 'ఉర్వి', 'ఆపరేషన్ అలమేలమ్మ', 'విక్రమ్వేధ', 'రిచి', 'ది విలన్', 'మిలన్ టాకీస్' 'కాట్రు వెలిదియై', 'ఇవన్ తంతిరై' వంటి తదితర చిత్రాల్లో నటించి తమిళ, మలయాళ , కన్నడ భాషలో మంచి పేరు సొంతం చేసుకుంది. ఇక 'జెర్సీ' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు మరింతగా దగ్గరైంది. దీంతో తెలుగులోనూ శ్రద్ధాకి మంచి ఆఫర్లు వస్తున్నాయి. ప్రస్తుతం 'జోడీ', 'రుస్తుమ్', 'గోద్రా', 'నెర్కొండ పరవై', 'మార' వంటి తెలుగు, తమిళం, కన్నడ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్న శ్రద్ధా తాజాగా తమిళంలో విశాల్ సరసన నటించే బంపర్ ఆఫర్ను దక్కించుకున్నట్టు తెలుస్తోంది. విశాల్ నటించిన చిత్రం 'ఇరుంబు తిరై'. తెలుగు, తమిళ భాషల్లో ఘనవిజయం సాధించిన ఈచిత్రానికి సీక్వెల్గా 'ఇరుంబు తిరై 2'ని తెరకెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. మిత్రన్ దర్శకత్వం వహించే ఈ చిత్రంలో విశాల్కి జోడీగా శ్రద్ధా నటించబోతోంది. మొత్తమ్మీద బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు, సక్సెస్లతో శ్రద్ధా క్షణం తీరిక లేకుండా బిజీగా ఉంటోంది.