Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విశ్వక్సేన్ కథానాయకుడిగా స్వీయ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'ఫలక్నుమా దాస్'. డి.సురేష్బాబు సమర్పణలో వన్మయి క్రియేషన్స్ పతాకంపై విశ్వక్సేన్ సినిమాస్, టెరనోవ పిక్చర్స్, మీడియా9 క్రియేటివ్ వర్క్స్ సంయుక్తంగా హైదరాబాద్ నేపథ్యంలో తెరకెక్కిన ఈచిత్ర ట్రైలర్ లాంచ్ సోమవారం రామానాయుడు స్టూడియోస్లో జరిగింది. ముఖ్యఅతిథి వెంకటేష్ ఈ సినిమా ట్రైలర్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'టీజర్ చూడగానే తెలిసిపోయింది. 40 మంది కొత్త కుర్రాళ్ళు ఒక ఛాలెంజ్గా తీసుకుని చాలా కష్టపడి నటించారు. అలాగే సినిమాలో చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంది. ఇక విశ్వక్ ప్రతి ఫ్రేమ్లోనూ తన యాక్టింగ్ స్కిల్స్ని అద్భుతంగా చూపించారు. ట్రైలర్ చాలా బాగుంది. టీం అందరూ వండర్ఫుల్గా చేశారు. రీసెంట్ టైమ్లో ఇంతలా యూత్కి నచ్చే సినిమా రాలేదు. హైదరాబాద్లోని రియల్ రస్టిక్ లొకేషన్స్ అన్నింటినీ కవర్ చేశారు. డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. స్క్రిప్ట్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలని, ఈ టీమ్ అందరికీ మంచి భవిష్యత్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను' అని చెప్పారు. 'ట్రైలర్ కట్ చేసినప్పుడు చాలా భయంగా అనిపించింది. టీజర్కి టెర్రిఫిక్ రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్కి అంతకన్నా ఎక్కువ రెస్పాన్స్ రావాలనుకున్నాను. అలాగే మంచి రెస్పాన్స్ వస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. రీసెంట్గా ఈసినిమాని సురేష్బాబు చూశారు. ఆయనకు బాగా నచ్చింది. అంతేకాదు ఆయన ఈ సినిమాని ప్రజెంట్ చేస్తున్నారు కూడా. అలాగే వెంకటేష్గారు చాలా సెలెక్టీవ్ పర్సన్. ఆయనది గోల్డెన్ హ్యాండ్. ఆయన్ని అడగ్గానే రావడానికి అంగీకరించారు. చాలా సంతోషం కలిగింది. అంతేకాదు చాలా ఎమోషనల్ అయ్యాను కూడా. ఇంకో రెండు రోజుల్లో రిలీజ్ డేట్ని ఎనౌన్స్ చెయ్యబోతున్నాం' అని హీరో, దర్శకుడు విశ్వక్సేన్ అన్నారు. 'సినిమా అద్భుతంగా వచ్చింది. 20 నుంచి 25 వయస్సున్న కుర్రాళ్ళంతా కష్టపడి వర్క్ చేశారు. నేచురల్గా రావాలని అడ్వాన్స్డ్ టెక్నాలజిని ఉపయోగించారు. హైదరాబాద్లో ఎవరికీ తెలియని 118 అద్భుతమైన లొకేషన్స్లో ఈ సినిమాని చిత్రీకరించాం. సినిమాని ఆదరిస్తారని ఆశిస్తున్నాను' అని నిర్మాత కరాటే రాజు అన్నారు. తరుణ్, సలోని మిశ్రా, హర్షిత్గౌర్, ప్రశాంతి, ఉత్తేజ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : విద్యాసాగర్, ఎడిటర్: రవితేజ, పాటలు : కిట్టు విస్సాప్రగడ, భాస్కర్భట్ల, సుద్దాల అశోక్తేజ.