Authorization
Mon Jan 19, 2015 06:51 pm
72వ అంతర్జాతీయ కేన్స్ చలన చిత్రోత్సవ సంబరాలు నేటి నుంచి ఫ్రెంచ్ రివేరాలో అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయి. అయితే ఈసారి మన భారతదేశానికి చెందిన ఏ చిత్రమూ పోటీ కోసం ఎంపిక కాకపోవడం శోచనీయం. ఈనెల 14 నుంచి 25వ తేదీ వరకు ఈ చలన చిత్రోత్సవం జరుగనుంది. ప్రపంచ వ్యాప్తంగా అందరూ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే 72వ కేన్స్ చలన చిత్రోత్సవ జ్యూరీకి ప్రముఖ మెక్సికన్ దర్శకుడు అలెజాండ్రో అధ్యక్షతన వహించబోతున్నారు. 'బర్డ్మ్యాన్', 'ది రెవెనెంట్' వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన అలెజాండ్రో ఆస్కార్ అవార్డును కూడా సొంతం చేసుకున్నారు. ఈ యేడాది అత్యంత వైభవంగా జరగబోయే ఈ కేన్స్ చలన చిత్రోత్సవ ప్రారంభ, ముగింపు వేడుకకు ప్రముఖ ఫ్రెంచ్ నటుడు, దర్శకుడు బాయర్ వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు. ఈ ఏడాది మార్చి 29న కన్నుమూసిన ప్రముఖ ఫ్రెంచ్ దర్శకురాలు, ఆర్టిస్టు ఆగేవార్డాకు సంతాపం తెలుపుతూ ఫెస్టివల్ మ్యాగజైన్లో ఆమె ఫొటోను ప్రచురించారు. 20 ఏండ్ల ముందు కేన్స్లో దర్శకుడు, నటుడు క్వెంటిన్ టారెంటీనో తీసిన 'పల్ఫ్ ఫిక్షన్' సినిమా ప్రీమియర్ను నిర్వహించారు. ఇన్నేండ్ల తర్వాత మళ్ళీ ఆయన తీసిన కొత్త హాలీవుడ్ సినిమా 'వన్స్ అపాన్ ఏ టైమ్' ప్రీమియర్ జరగబోతోంది.
ఈ ఏడాది మన దేశం నుంచి కేన్స్ రెడ్ కార్పెట్పై బాలీవుడ్ నటీమణులు దీపికాపదుకొనె, సోనమ్కపూర్, కంగనారనౌత్, ఐశ్వర్యరారు బచ్చన్, హినాఖాన్, హ్యుమా ఖురేషి తదితరులు సందడి చేసే అవకాశం ఉంది. ఈ ఏడాది ఒక్క భారతీయ సినిమా కూడా కేన్స్కు ఎంపిక కాలేదు. హినాఖాన్ నటించిన తొలి సినిమా 'లైన్స్' ఫస్ట్లుక్ను కేన్స్ చలన చిత్రోత్సవంలో ఆవిష్కరించబోతున్నారు. ఈ ఏడాది 13 మంది మహిళా ఫిల్మ్మేకర్స్ను కేన్స్ ఎంపిక చేసింది. ఇందులో నలుగురు ప్రతిష్టాత్మక పామ్ డీ వోర్ పురస్కారం కోసం పోటీ పడుతున్నారు. ఏదిఏమైనా మనదేశానికి సంబంధించి ఏ సినిమా కేన్స్కి ఎంపిక కాకపోవడం బాధాకరం.