Authorization
Mon Jan 19, 2015 06:51 pm
72వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ మంగళవారం అట్టహాసంగా ప్రారంభమైంది. తొలిరోజు ప్రపంచ వ్యాప్తంగా వివిధ చిత్ర పరిశ్రమలకు చెందిన కథానాయికలు రెడ్ కార్పెట్పై సందడి చేసి వీక్షకులను మంత్రముగ్దుల్ని చేశారు. ఏటా ఫ్రాన్స్లోని ఫ్రెంచ్ రివేరా నదీ తీరాన ఈ వేడుక జరుగుతున్న విషయం విదితమే. ఈసారి ఈ నెల 14 నుంచి 25 వరకు 12 రోజుల పాటు ఈ వేడుక అంగరంగ వైభవంగా జరగబోతోంది. ఇందులో మెయిన్ కాంపిటీషన్
జ్యూరీ అధ్యక్షులుగా ప్రముఖ మెక్సికల్ ఫిల్మ్ మేకర్ అలెజాండ్రో ఇనార్రీటు వ్యవహరించనున్నారు.
'బర్డ్మెన్', 'ది రెవెనెంట్', 'ఫ్లష్ అండ్ సాండ్' చిత్రాలకు దర్శకత్వం వహించడంతోపాటు ఉత్తమ దర్శకుడిగా అలెజాండ్రో ఆస్కార్ని సొంతం చేసుకున్న విషయం విదితమే. జిమ్ జార్ముచ్ రూపొందించిన 'ది డెడ్ డోన్ట్ డై' చిత్రాన్ని ఓపెనింగ్ సెర్మనీలో ప్రదర్శించనున్నారు. క్లోజింగ్ సెర్మనీలో 'ది స్పెషల్స్' చిత్రం ప్రదర్శితం కానుంది. ఈసారి వేడుకలో భిన్న దేశాలకు చెందిన 21 విలక్షణ సినిమాలు మెయిన్ కాంపిటీషన్లో ప్రతిష్టాత్మక పాల్మా డీ ఓర్ కోసం పోటీపడుతున్నాయి. 18 సినిమాలు అన్ సర్టెన్ రిగార్డ్లో, 11 లఘు చిత్రాలు పురస్కారాల కోసం పోటీలో ఉన్నాయి. ఇక ఈ ఏడాది మన దేశానికి చెందిన ఒక్క సినిమా కూడా కేన్స్కి ఎంపిక కాకపోవడం గమనార్హం. కానీ ఇండియాకి చెందిన సౌరవ్ రారు(డార్జిలింగ్), డామినిక్ సంగ్మా(మేఘాలయ), సినిమాటోగ్రాఫర్ మొధురా పాలిట్(కోల్కతా) అన్ సర్టెన్ రిగార్డ్, డైరెక్టర్స్ ఫోర్ట్నైట్, క్రిటిక్స్ వీక్లో పాల్గొననున్నారు. ఇక ఎప్పటిలాగే మన భారతీయ నటీమణులు కేన్స్ రెడ్ కార్పెట్పై సందడి చేసేందుకు సిద్దమవుతున్నారు.
లోరియల్ కాస్మొటిక్ బ్రాండ్ తరపున మన హీరోయిన్లు అక్కడ అలరించనున్నారు. ఈసారి ఐశ్వర్యరారు, దీపికా పదుకొనె, సోనమ్ కపూర్, కంగనా రనౌత్, హ్యూమా ఖురేషి, మల్లికా షెరావత్, హినా ఖాన్, డయాన పెంటీలు ఎంపికయ్యారు. వీరంతా ట్రెండీ డ్రెసెస్ ధరించి ఎర్ర తివాచీపై హల్చల్ చేయనున్నారు. ఈనెల 20, 21న సోనమ్ కపూర్, ఈ నెల 16న దీపికా పదుకొనె, 16 నుంచి 18 వరకు మూడు రోజులపాటు కంగనా రనౌత్ రెడ్ కార్పెట్పై సందడి చేయబోతున్నారు. హ్యూమా ఖురేషి ఈ నెల 19, 20న, ఐశ్వర్య రారు ఈ నెల 19న ఎర్ర తివాచీపై మెరవనుంది. హినా కాన్ ఈ నెల 17న ఆహుతులను మెస్మరైజ్ చేసేందుకు రెడ్కార్పెట్పైకి రాబోతున్నారు. మల్లికా ఇప్పటికే కేన్స్లో సందడి చేస్తోంది. ఇదిలా ఉంటే కేన్స్లో ఐశ్వర్యకిది 18వ సారి కాగా, దీపికకిది మూడోసారి, కంగనా, మల్లికా షెరావత్, హ్యూమా ఖురేషీలకి రెండోసారి. హినా ఖాన్కిది మొదటిసారి. ఈ వేడుకల్లోనే హినాఖాన్ నటించిన తొలి చిత్రం 'లైన్స్' ఫస్ట్లుక్ని ఆవిష్కరించ బోతున్నారు. ఏడు దశాబ్దాల కేన్స్ చరిత్రలో మనదేశానికి చెందిన పలు సినిమాలు వివిధ విభాగాల్లోని పోటీల్లో గెలిచి ప్రతిష్టాత్మక కేన్స్ పురస్కారాలను దక్కించుకున్నాయి. అయితే గత కొన్నేండ్లుగా మన దేశానికి చెందిన ఏ ఒక్క సినిమా కూడా సముచితమైన పురస్కారాన్ని దక్కించుకోలేదు. ఇక ఈఏడాది కనీసం ఒక్క సినిమాగాని, ఒక్క షార్ట్ ఫిల్మ్గాని పోటీకి ఎంపిక కాలేదు. స్క్రీనింగ్స్కి కూడా ఎంపిక కాకపోవడం గమనార్హం. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమా ఎప్పటికప్పుడు సత్తా చాటుతూనే ఉన్నప్పటికీ
అటు ఆస్కార్ అవార్డుల బరిలోను, ఇటు కేన్స్ చలన చిత్రోత్సవ సంబరాల్లోనూ తెలుగు సినిమా గురించి వినిపించక పోవడం కూడా బాధాకరం.