Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ జంటగా తేజ దర్శకత్వంలో 'సీత' చిత్రం రూపొందుతుంది. ఏ.కె.ఎంటర్టైన్మెంట్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి ఇటీవల విడుదలైన ట్రైలర్కి మంచి స్పందన లభిస్తుంది. తాజాగా 'నిజమేగా..' అంటూ సాగే మరో పాటని విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర బృందం తెలియజేస్తూ, 'ఇటీవల విడుదలైన ట్రైలర్కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. రెండు మిలియన్స్ వ్యూస్ని దాటింది. తాజాగా రిలీజ్ చేసిన 'నిజమేనా..' పాట శ్రోతలని విశేషంగా అలరిస్తుంది. అనూప్ రూబెన్స్ అద్భుతమైన పాటలను అందించారు. త్వరలోనే ఆడియోని విడుదల చేయనున్నాం. ఇక సినిమాలో హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తన గత చిత్రాలకు పూర్తి భిన్నమైన, కొత్త తరహా పాత్రలో నటిస్తున్నారు. టైటిల్ పాత్రని కాజల్ పోషిస్తుంది. మన్నారా చోప్రా మరో నాయికగా, బాలీవుడ్ నటుడు సోనూసూద్ విలన్గా నటిస్తున్నారు. భావోద్వేగ భరిత యాక్షన్ డ్రామాగా సినిమా సాగుతుంది. పాయల్ రాజ్పుత్ నటించిన 'బుల్రెడ్డి బుల్లెట్ ' సాంగ్ సినిమాకి హైలైట్ అవుతుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సినిమాని ఈ నెల 24న గ్రాండ్గా విడుదల చేయనున్నాం' అని తెలిపింది. తనికెళ్ళ భరణి, అభినవ్ గోమటం, అభిమన్యు సింగ్ ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: శిర్షా రే, ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు.