Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీనియర్ డైరెక్టర్స్తోపాటు బాగా అనుభవం ఉన్న దర్శకులతో ఎక్కువగా పనిచేసే విజరు ఇప్పుడు కొత్త వారికి అవకాశాలు ఇవ్వబోతున్నారు. అప్ కమింగ్ డైరెక్టర్స్తో వర్క్ చేసేందుకు సిద్ధమే అని ఇటీవలే ప్రకటించారు. 'మంచి కథలతో నన్ను మెప్పించి, సినిమాని బాగా తీయగలమనే నమ్మకాన్ని కలిగించిన దర్శకులతో సినిమాలు చేసేందుకు నేను రెడీగా ఉన్నా' అని ఇటీవల విజరు ప్రకటించారు. ఈ నేపథ్యంలో అలా వచ్చిన ఓ దర్శకుడికి విజరు అవకాశం ఇచ్చారట. లోకేష్ కనగరాజ్ అనే యువ డైరెక్టర్ చెప్పిన కథకి ఇంప్రెస్ అయిన విజరు అతని డైరెక్షన్లో సినిమా చేయాలని నిర్ణయించుకున్నారట. తదుపరి చిత్రం లోకేష్తోనే ఉంటుందని తెలుస్తుంది. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో విజరు ఓ సినిమా చేస్తున్నారు. 'థెరి', 'మెర్సల్' తర్వాత విజరు, అట్లీ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రమిది. ఇందులో నయనతార హీరోయిన్గా నటిస్తుంది.
స్పోర్ట్స్ ప్రధానంగా ఈ చిత్రం సాగుతుంది. ఇది అక్టోబర్లో విడుదల కానుంది. లోకేష్ గతంలో
'మానగరం', 'అవియల్', 'ఖైతి' చిత్రాలను రూపొందించి మంచి పేరు తెచ్చుకున్నారు.