Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'రామరావణ యుద్ధం జరిగిన వందేళ్ల తర్వాత లంకలోని రాక్షస స్త్రీలు తమ బిడ్డలకు సీతారాముల కథని చెప్పి తర్వాతి తరాలలో రాక్షస గుణాలను ఎలా తొలగించారనే కథాంశంతో 'పిబరే రామరసం' చిత్రాన్ని రూపొందిస్తున్నాం' అని దర్శకుడు జనార్థన మహర్షి అన్నారు. గతంలో ఆయన 'దేవస్థానం' , కళాతపస్వి కె.విశ్వనాథ్ జీవితం ఆధారంగా 'విశ్వదర్శనం' సినిమాలని రూపొందించారు. నేడు(గురువారం) జనార్థన మహర్షి పుట్టిన రోజు. ఈ సందర్భంగా కొత్త చిత్రాన్ని ప్రకటించారు. సి.కళ్యాణ్ దీన్ని నిర్మించనున్నారు. నిర్మాత మాట్లాడుతూ, 'కె.విశ్వనాథ్ జీవితం ఆధారంగా జనార్థన మహర్షి తెరకెక్కిన 'విశ్వదర్శనం' చిత్రం విడుదల కాకముందే పలు అవార్డులను సొంతం చేసుకుంది. రామాయణ సారంతో తెరకెక్కించబోతున్న ఈ చిత్రంలోని సీత పాత్రను ఓ ప్రముఖ హీరోయిన్ పోషిస్తార'న్నారు. 'అనాడు రాక్షసులు తనివితీరా తాగి, తరించిన రామరసమే ఈ 'పిబరే రామరసం'. ఈ చిత్రాన్ని సి.కళ్యాణ్ నిర్మించడం ఆనందంగా ఉంది' అని దర్శకుడు తెలిపారు.