Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'విభిన్న కథాంశాలతో కూడిన సినిమాలు చేయడం వల్లే నేనీ స్థాయిలో ఉన్నాను' అని అంటోంది కత్రినా కైఫ్. బాలీవుడ్లో అగ్ర కథానాయికగా రాణిస్తున్న వారిలో కత్రినా ముందుంటుంది. ప్రస్తుతం ఆమె సల్మాన్తో కలిసి 'భారత్'లో నటించింది. ఆరు దశాబ్దాల ఓ వ్యక్తి జర్నీని తెలిపే కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రానికి అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహిస్తున్నారు. దిశా పటానీ మరో కథానాయిక, టబు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇది రంజాన్ సందర్భంగా వచ్చే నెల 5న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర ప్రమోషన్లో భాగంగా కత్రినా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, 'గతంలో ఎప్పుడూ పోషించని ఓ కొత్తరకమైన పాత్రలో ఇందులో నటిస్తున్నా. నా పాత్రలో చాలా షేడ్స్ ఉంటాయి. సినిమా కోసం ఆడియెన్స్లాగే నేను కూడా వెయిట్ చేస్తున్నా. నటిగా నా కెరీర్ విషయంలో చాలా హ్యాపీగా ఉన్నా. ఈ జర్నీలో ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నా. ఎంతో మందిని కలిశాను. వారి నుంచి కొత్తగా, డిఫరెంట్గా ఎలా నటిం చాలో తెలుసుకున్నా. యాక్టర్స్కి ప్రశంసలు బూస్ట్ లాంటివి. మరింత ఉత్సాహంగా పనిచేసేందుకు ఎనర్జీనిస్తాయి' అని తెలిపింది.