Authorization
Mon Jan 19, 2015 06:51 pm
72వ కేన్స్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ రెండో రోజు ఆద్యంతం ఉత్సాహభరితంగా సాగింది. మన దేశానికి చెందిన టీవీ నటి హీనా ఖాన్ తొలిసారి కేన్స్ రెడ్ కార్పెట్పై సందడి చేయటం హైలైట్గా నిలిచింది. 'బాకురా' చిత్ర ప్రీమియర్లో భాగంగా నిర్వహించిన రెడ్ కార్పెట్లో హీనా పాల్గొని సెంటర్ఆఫ్ ఎట్రాక్షన్ అయ్యింది.
ఈ ఏడాది కేన్స్లో సందడి చేసిన మొదటి భారతీయ నటి హీనా కావడం విశేషం. అంతేకాదు ఆమె కేన్స్లో పాల్గొనడం కూడా ఇదే మొదటిసారి కావడం మరో విశేషం. జియాద్ నాకాడ్ డిజైన్ చేసిన స్పార్ల్కీ సిల్వర్ ఫ్లోర్ లెన్త్ గౌన్ ధరించి రెడ్ కార్పెట్పై హొయలు పోతూ అందరినీ గిలిగింతలు పెట్టింది.
ఇక 'లెస్ మిసెరబుల్స్' చిత్ర ప్రీమియర్లో భాగంగా నిర్వహించిన రెడ్ కార్పెట్ సెషన్లో ఎల్లె ఫన్నింగ్, అలెసాండ్రా అంబ్రోసియో, సెలేనా గోమేజ్, జూలియానా మూర్, క్రిస్ లీ వంటి కథానాయికలు పాల్గొని సందడి చేశారు. ఈ వేడుకలో భారత్ నుంచి సంగీత దర్శకుడు రెహ్మాన్, చెఫ్ వికాస్ ఖన్నా పాల్గొన్నారు. వీరితో కేంద్ర సెన్సార్ బోర్డ్ చైర్మెన్ ప్రసూన్జోషి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రసూన్ జోషి మాట్లాడుతూ, 'కేన్స్ వేడుకలో భారత్కి చెందిన గొప్ప క్రియేటివిటీని ప్రదర్శించడం ముఖ్యం. ఈ క్రమంలో వ్యాపారపరమైన అవగాహన అవసరం. ఇందులో పాల్గొనడం ఆనందంగా ఉంది' అని తెలిపారు. రెహ్మాన్ తాను రూపొందించిన 'లె మస్క్' చిత్రాన్ని ఇందులో ప్రమోట్ చేస్తున్నారు. ఆయన తన భార్య సైరా బానుతో కలిసి రెహ్మాన్ సందడి చేయడం ఓ విశేషమైతే, రెహ్మాన్తో కలిసి ప్రసూన్ జోషి ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా గోల్డెన్ జూబ్లీ పోస్టర్ని విడుదల చేయడం మరో విశేషం. కేన్స్ వేడుక ఈ నెల 25 వరకు కొనసాగుతుంది.