Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అద్వైత్, జిహీదా శ్యామ్, అలోక్ జైన్, జి.సీతారెడ్డి ప్రధాన పాత్రధారులుగా గురు చిందేపల్లి దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'ఎంతవారలైనా'. సంహిత, చిన్ని, చింటు సమర్పణలో రామదూత ఆర్ట్స్ పతాకంపై జి.సీతారెడ్డి నిర్మించారు. నేడు(శుక్రవారం) సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా గురువారం ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో నిర్మాత జి.సీతారెడ్డి మాట్లాడుతూ, 'లవ్, సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రమిది. సుక్కు అద్భుతమైన మ్యూజిక్ అందించారు. ఆయన లేకపోతే సినిమా ఈ రేంజ్లో ఉండేది కాదు. అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించారు. పాటలకు విశేష ఆదరణ లభించింది. యూట్యూబ్లో టాప్లో ఉన్నాయి. ఈ సినిమాతో సుక్కుకి మంచి బ్రేక్ వస్తుంది. దర్శకుడు గురు చిందేపల్లి తన టాలెంట్ ప్రదర్శించారు. ఇందులో నేను పవర్ఫుల్ ఎస్పీ పాత్ర పోషించా. సినిమాపై చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. కచ్చితంగా పెద్ద హిట్ అవుతుందని నమ్ముతున్నా' అని అన్నారు. 'తప్పు చేస్తే ఎంత వారలైనా శిక్షార్హులే అనే కాన్సెప్ట్తో రొమాంటిక్ సస్పెన్స్ థ్రిల్లర్గా ఈ సినిమాని రూపొందించాం. నిర్మాత సీతారెడ్డి బాగా సపోర్ట్ చేశారు. సుక్కు అందించిన మంచి మ్యూజిక్కి మంచి సింగర్స్ తోడవ్వడంతో పాటలు మరో స్థాయిలో వచ్చాయి. దీనికి మురళీ అద్భుతమైన విజువల్స్ మరింత ప్లస్ అయ్యాయి. కనువిందుగా సినిమా ఉంటుంది.' అని చిత్ర దర్శకుడు గురు చిందేపల్లి చెప్పారు. సంగీత దర్శకుడు సుక్కు చెబుతూ, ''ఏహే మురారి..' అంటూ సాగే పాటకి మిలియన్ వ్యూస్ వచ్చాయి. పాటలన్ని తెరపై మరింతగా ఆకట్టుకుంటాయని నమ్ముతున్నా' అని చెప్పారు.