Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రభుదేవా, తమన్నా ప్రధాన పాత్రధారులుగా బాలీవుడ్లో 'ఖామోషి' చిత్రం రూపొందుతుంది. చక్రి తోలేటి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో భూమిక, సంజరు సూరి, మురళీ శర్మ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల చిత్ర టీజర్ని విడుదల చేశారు. అది విశేషంగా ఆకట్టుకుంది. తాజాగా ట్రైలర్ని విడుదల చేశారు. ఇందులో తమన్నా పెయింటర్గా కనిపిస్తుంది. ప్రభుదేవా సైకో కిల్లర్గా నటిస్తున్నట్టు తెలుస్తుంది. తమన్నా ఇంట్లోకి సైకో కిల్లర్ ప్రభుదేవా ప్రవేశించి ఇంట్లో వారందరినీ వరుసగా చాలా నిశ్శబ్దంగా చంపేస్తుంటాడు. చివరిగా తమన్నా వంతు వస్తుంది. మరి ఆ కిల్లర్ నుంచి తప్పించుకుందా లేదా అనే కథాంశంతో హర్రర్ సస్పెన్స్ థ్రిల్లర్గా ఈ సినిమా సాగుతుందని ట్రైలర్ని బట్టి అర్థం అవుతుంది. 'ఒక్కసారి అతనికి దొరికితే, ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలి పెట్టడు..' అనే డైలాగ్ ఆకట్టుకుంటుంది. ఇందులో హీరో ప్రభాస్ గెస్ట్ పాత్రలో మెరవనున్నారట. ఈ సినిమా ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు రానుంది.
తమన్నా, ప్రభుదేవా 'దేవి 2'లోనూ నటిస్తున్నారు.