Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మణిరత్నం ప్రస్తుతం మరో భారీ సినిమాని తెరకెక్కించే పనిలో ఉన్నారు. రాజ రాజచోళ నాటి చరిత్ర కథాంశంతో చోళ సామ్రాజ్య నేపథ్యంలో భారీ బడ్జెట్తో మల్టీస్టారర్ సినిమాని రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నారు. అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యరారు, విక్రమ్, జయంరవి, శింబు, అమలాపాల్, మోహన్బాబు వంటి భారీ తారాగణం ఇందులో నటిస్తుంది. దీనికి 'పొన్నియిన్ సెల్వమ్' అనే టైటిల్ పరిశీలిస్తున్నారట. అయితే ఇందులో ఐశ్వర్య పోషించే పాత్రకి సంబంధించి పలు ఆసక్తికర వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఇందులో ఆమె నెగటివ్ రోల్లో కనిపిస్తారట. ప్రిన్సెస్ నందిని పాత్రలో నటిస్తారని తెలుస్తోంది. రాజు పెరియా పజువెట్టరైయర్కి భార్య నందిని. పవర్ కోసం తహతహలాడే రాణి నందినిగా ఐశ్వర్య కనిపిస్తారట. తనకు జరిగిన అన్యాయానికి ప్రతీకగా చోళ రాజ్యాన్ని పతనం చేయాలని ఐశ్వర్య కుట్రలు పన్నుతారట. గతంలో వచ్చిన 'ఖాకీ' (2004) చిత్రంలో నెగటివ్ రోల్లో నటించి ఐశ్వర్య అందరినీ మెప్పించిన విషయం విదితమే. ఈ పీరియడ్ డ్రామా ఈ ఏడాది చివర్లో సెట్స్పైకి వెళ్ళనుందని తెలుస్తుంది. గతేడాది వచ్చిన 'ఫన్నే ఖాన్' చిత్రంలో నటించిన ఐశ్వర్య ఆ తర్వాత మరే కొత్త చిత్రానికి గ్రీన్సిగల్ ఇవ్వలేదు.