Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హవీష్ హీరోగా నిజార్ షఫీ దర్శకత్వంలో కిరణ్ స్టూడియోస్ పతాకంపై రమేష్ వర్మ నిర్మించిన చిత్రం 'సెవెన్'. రెజీనా, నందితా శ్వేత, అనీష్ ఆంబ్రోస్, త్రిధా చౌదరి, అదితి ఆర్య, పూజితా పొన్నాడ ఇందులో కథానాయికలుగా నటించారు. రమేష్ వర్మ కథ అందించిన ఈ చిత్ర విడుదల హక్కులను అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామా దక్కించుకున్నారు. ఈ సందర్భంగా అభిషేక్ నామా మాట్లాడుతూ, ''ఐ థింక్ ఆయామ్ ఇన్ లవ్ విత్ యు కార్తీక్' అని ఆరుగురు అమ్మాయిలు కార్తీక్కి ప్రపోజ్ చేస్తారు. అతడు ఆరు సార్లు నవ్వుతాడు. ఆరుగురికీ ముద్దులు పెట్టి ముగ్గులోకి దించుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది మిగిలిన కథ. ఇటీవల సినిమా ఫస్ట్ కాపీ చూశా. మైండ్ బ్లోయింగ్. డిఫరెంట్ రొమాంటిక్ థ్రిల్లర్ చిత్రమిది. థ్రిల్లర్ సినిమాల్లో సరికొత్త ట్రెండ్ సృష్టిస్తుంది. ఒక ట్విస్ట్ వెనుక మరొక ట్విస్ట్ ప్రేక్షకుల్ని సర్ప్రైజ్ చేస్తాయి. రమేష్ వర్మ అద్భుతమైన కథ, స్క్రీన్ప్లే అందించారు. నిర్మాణంలోనూ రాజీ పడలేదు. చాలా రిచ్గా తెరకెక్కించారు. సినిమాకి ఆయన కథ ఒక హైలైట్ అయితే, హవీష్ యాక్టింగ్ మరో హైలైట్. హవీష్ పరిణతి చెందిన నటన ప్రదర్శించాడు. రమేష్ వర్మ కథకు నిజార్ షఫీ న్యాయం చేశారు. ఆయన సినిమాటోగ్రఫీ కూడా సూపర్. ఆరుగురు హీరోయిన్ల పాత్రలు కథలో భాగంగా సాగుతాయి. ప్రేక్షకులకు ఒక హాలీవుడ్ సినిమా చూసిన అనుభూతి కలుగుతుంది. రహమాన్, సుంకర లక్ష్మి ప్రధాన పాత్రలు పోషించారు. సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఇప్పటికే శుభం విశ్వనాధ్ సాహిత్యం అందించిన 'సంపోద్దోరు నన్నే', పులగం చిన్నారాయణ సాహిత్యం అందించిన 'ఇదివరకెప్పుడు తెలియదు' పాటలు విడుదలై ఆదరణ పొందుతున్నాయి. ఇటీవల సినిమా ట్రైలర్ విడుదలై మంచి స్పందన రాబట్టుకుంటోంది. సినిమా బాగా నచ్చడంతో వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ తీసుకున్నాను. జూన్ 5న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం' అని అన్నారు.