Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గతంలో చాలా సార్లు మోస్ట్ డిజైరబుల్ మెన్గా నిలిచిన మహేష్బాబు తాజాగా మరో ఘనత సాధించారు. ది టైమ్స్ ప్రకటించిన 'టైమ్స్ మోస్ట్ ఫరెవర్ డిజైరబుల్ క్లబ్'లో చోటు సంపాదించారు. ఇందులో ఆయన మొదటి స్థానంలో నిలిచారు. అయితే ఈ జాబితాలో గతంలో మాదిరి సీనియర్లని కాకుండా యువ నటులనే మాత్రమే ఎంపిక చేస్తున్నారట. అందుకోసం కొత్త లిస్ట్ని ప్రవేశ పెట్టింది. అందులో భాగంగా 2019కి చెందిన జాబితాలో మహేష్కి స్థానం దక్కింది. 'ది టైమ్స్ 50 మోస్ట్ డిజైరబుల్ మెన్' జాబితాలో తెలుగు నుంచి యువసంచలనం విజరు దేవరకొండ, ప్రభాస్, రానా కూడా చోటు సంపాదించారు. విజరు దేవరకొండ నాల్గవ ర్యాంక్ని, బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ మూడవ ర్యాంక్, ప్రభాస్ 12వ ర్యాంక్, రానా 19వ ర్యాంక్ని సంపాదించారు. ఇదిలా ఉంటే, ఈ మోస్ట్ డిజైరబుల్ మెన్ లిస్ట్లో తరచూ నిలిచే బాలీవుడ్ అగ్ర కథానాయకులు అమీర్ఖాన్, సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్, అక్షరు కుమార్లకు ఈసారి చోటు దక్కకపోవడం గమనార్హం.
హృతిక్, రణ్వీర్ సింగ్, విక్కీ కౌశల్కి ఇందులో స్థానం దక్కింది. మహేష్బాబు ఇటీవల 'మహర్షి'తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇది మిశ్రమ స్పందనని రాబట్టుకుంటున్నప్పటికీ మంచి కలెక్షన్లని వసూలు చేస్తోంది. త్వరలో ఆయన అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ వినోదాత్మక చిత్రం చేయనున్నారు. ఇక విజరు దేవరకొండ ప్రస్తుతం 'డియర్ కామ్రేడ్'లో నటిస్తున్నారు. భారత్ కమ్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా కథానాయిక. ఇది త్వరలో విడుదల కానుంది. దీంతోపాటు క్రాంతి మాధవ్ సినిమాతోపాటు 'హీరో' చిత్రంలో విజరుదేవరకొండ, 'సాహో'లో ప్రభాస్, '1945', 'హిరణ్యకశ్యప', 'హాథి మేరీ సాథి', 'విరాటపర్వం', 'హౌస్ఫుల్ 4' చిత్రాల్లో రానా నటిస్తున్నారు.