Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'పల్లెటూరిలో జన్మించిన ఓ అమ్మాయి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని జాతీయ స్థాయిలో ఛాంపియన్గా ఎలా నిలిచిందనేది తెలియాలంటే 'మహిళా కబడ్డీ' చిత్రం చూడాల్సిందే అంటున్నారు ప్రతాని రామకృష్ణ గౌడ్. రచనా స్మిత్, కావ్యా రెడ్డి ప్రధాన పాత్రధారులుగా ఆర్.కె.ఫిల్మ్స్ పతాకంపై ప్రతాని రామకృష్ణ గౌడ్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం 'మహిళా కబడ్డీ'. శనివారం రామకృష్ణగౌడ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయన రూపొందిస్తున్న 'మహిళా కబడ్డీ' చిత్ర పోస్టర్ లాంచ్ కార్యక్రమం జరిగింది.
అతిథిగా విచ్చేసిన తెలంగాణ ఇండిస్టీయల్ కార్పొరేషన్ చైర్మెన్ బాలమల్లు పోస్టర్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా బాలమల్లు మాట్లాడుతూ, 'ఆర్.కె.గౌడ్ నాకు మంచి మిత్రుడు. తెలంగాణ సినిమా అభివృద్ధి కోసం నిరంతరం పాటు పడుతుంటాడు. ఆయన తెరకెక్కించబోతున్న ఈ చిత్రంలోని రెండు పాటలు విన్నా. చాలా బాగున్నాయి. సినిమా కూడా విజయం సాధించాలి' అని అన్నారు. 'ఈ చిత్ర పాటల రీకార్డింగ్ పూర్తయ్యింది. విడుదలైన పాటలు విశేష ఆదరణ పొందుతున్నాయి. రెండు పాటలను గీతా మాధురి, రెండు పాటలు మంగ్లీ, మరో రెండు పాటలను మధుప్రియా, శ్రావణ భార్గవి పాడారు. రాజ్ కిరణ్ మంచి సంగీతాన్ని అందించారు. పూర్తి స్క్రిప్ట్ రెడీ అయ్యింది. ప్రీ ప్రొడక్షన్స్ కూడా పూర్తి కావచ్చాయి. వచ్చే నెల నుంచి రెగ్యులర్ షూటింగ్కి వెళ్ళనున్నాం. వీలైనంత త్వరగా చిత్రీకరణ పూర్తి చేసి సినిమాని విడుదల చేస్తాం. దీంతోపాటు తెలంగాణ ఫిల్మ్ కల్చరల్ సెంటర్ని పూర్తి స్థాయిలో తీసుకొచ్చేందుకు ఆర్నేళ్ళుగా కృషి చేస్తున్నాం. ఇందులో అన్ని సౌకర్యాలున్నాయి. అయితే సినిమా వాళ్ళకి ప్రత్యేకంగా ఎలాంటి ఫిల్మ్ కల్చరల్ సెంటర్స్ లేవు. అందుకే దీన్ని ప్రత్యేకంగా సినిమా వాళ్ళ కోసం డిజైన్ చేశాం. ఇందులో సినిమా జర్నలిస్ట్లకు కూడా సభ్యత్వం ఇచ్చే విషయంపై ఆలోచిస్తున్నాం. దీంతోపాటు పది వేల మందికి సరిపోయేలా ఓ కాన్ఫరెన్స్ హాల్ కట్టాలని ప్రయత్నిస్తున్నాం' అని అన్నారు. ఈ కార్యక్రమంలో లయన్ విజరు కుమార్, అలీ ఖాన్, రంజని, స్నిగ్ధ తదితరులు పాల్గొన్నారు.