Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'పోయిన చోటే వెతుక్కోవాలని తెలుగులో ఓ నానుడి ఉంది. పడిన చోటే పైకి లేవాలని పెద్దలు చెబుతుంటారు. ఓ కుర్రాడు తాను పడిన మార్కెట్ చోటే నిలబడాలని ప్రయత్నిస్తుంటాడు. వయసులో చిన్నవాడైనా ధైర్యంతో మార్కెట్ పెద్దలతో తలపడతాడు. ఈ యుద్ధంలో గెలుపెవరిది అనేది తెలియాలంటే 'ఎవడు తక్కువ కాదు' సినిమా చూడాల్సిందే' అని అంటున్నారు దర్శకుడు రఘు జయ. విక్రమ్ సహిదేవ్ హీరోగా రఘుజయ దర్శకత్వంలో లగడపాటి శిరీష సమర్పణలో రామలక్ష్మి సినీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శ్రీధర్ నిర్మిస్తున్న చిత్రం 'ఎవడు తక్కువ కాదు'. ప్రియాంక జైన్ కథానాయికగా నటించింది. తాజాగా సెన్సార్ పూర్తి చేసుకుని 'యు/ఏ' సర్టిఫికేట్ పొందింది. ఈ సందర్భంగా నిర్మాత లగడపాటి శ్రీధర్ మాట్లాడుతూ, 'ఇప్పటికే విడుదల చేసిన టీజర్, ట్రైలర్, పాటలకు మంచి ప్రశంసలు రావడం చాలా హ్యాపీగా ఉంది. పగ, ప్రతీకారం నేపథ్యంలో సరికొత్త కథ, కథనాలతో అందమైన ప్రేమ కథ మేళవింపుగా సాగే చిత్రమిది. దర్శకుడు రఘు సినిమాని అత్యంత సహజంగా తెరకెక్కించారు. రియలిస్టిక్గా ఉండే రా అప్రోచ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ట్రైలర్లో విక్రమ్ సహిదేవ్ యాక్టింగ్, డైలాగ్ డెలివరీ బాగుంది. అగ్రెస్సివ్గా కనిపిస్తున్నాడని ఇటీవల ట్రైలర్ విడుదల చేసిన సుకుమార్ అన్నారు. ఈ నెల 24న సినిమాని విడుదల చేస్తున్నాం. సినిమా చూసి ఆడియెన్స్ మా విక్రమ్ని ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నా' అని అన్నారు. రఘు కారుమంచి కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: హరి గౌర.