Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చిరంజీవి మేనల్లుడు, హీరో సాయిధరమ్ తేజ్ సోదరుడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా 'ఉప్పెన' చిత్రం రూపొందుతుంది. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ పతాకంపై రూపొందుతుంది. విజయ్ సేతుపతి కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి తాజాగా హీరోయిన్ని ఫైనల్ చేశారు. ఈ సందర్భంగా చిత్ర బృందం తెలియజేస్తూ, 'ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ నెల 25 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నాం. సుకుమార్ దగ్గర అసిస్టెంట్గా పనిచేసిన బుచ్చిబాబు ఈ సినిమాతో దర్శకుడిగా మారడం విశేషం. తాజాగా ఇందులో వైష్ణవ్ తేజ సరసన నటించే కథానాయికగా మంగుళూరుకి చెందిన క్రితి శెట్టి తెలుగులో పరిచయం కానుంది. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తుండగా, శ్యామ్ దత్ సైనుద్దీన్ కెమెరామెన్గా వర్క్ చేస్తున్నారు. సరికొత్త కథాంశంతో ఈ సినిమా సాగుతుంది' అని తెలిపింది. ఈ చిత్రానికి ఎడిటర్: నవీన్ నూలి, ఆర్ట్: మోనిక రామకృష్ణ.