Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అల్లు శిరీష్, రుక్సర్ థిల్లన్ జంటగా సంజీవ్రెడ్డి దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'ఏబీసీడీ'. డి.సురేష్బాబు సమర్పణలో మధుర శ్రీధర్రెడ్డి, యష్ రంగినేని నిర్మించారు. శుక్రవారం విడుదలైన సినిమాకి పాజిటివ్ టాక్ వస్తున్న నేపథ్యంలో చిత్ర బృందం సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ, 'మార్నింగ్ షోతోనే బలమైన ఓపెనింగ్స్తో సినిమా స్టార్ట్ అయ్యింది. తండ్రీ కొడుకుల మధ్య ఎమోషన్ని కరెక్ట్గా డిజైన్ చేయాలని, తెలుగు ప్రేక్షకులందరికీ నచ్చేలా తీయాలని ఏదైతే అనుకున్నామో అదే జరిగింది. శిరీష్ ఫెంటాస్టిక్గా నటించాడు. అల్లు శిరీష్ కొత్త స్టార్గా మారాడని అందరూ అంటున్నారు. తనెంత కష్టపడ్డాడో నాకు తెలుసు. తనలో హ్యాపీనెస్ చూడాలనుకున్నాను. అది ఈరోజు నెరవేరింది. హీరో, హీరోయిన్ మధ్య లవ్ స్టోరీ, భరత్, వెన్నెలకిషోర్ కామెడీ హైలైట్ అయ్యాయని అంటున్నారు. అమెరికాలో పుట్టిన ఓ యువకుడు ఇండియాకు వచ్చినప్పుడు ఇక్కడి పరిస్థితులను అర్థం చేసుకున్న విధానాన్ని ఎంటర్టైనింగ్గా చేశారని అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. 68 శాతం ఓపెనింగ్తో ప్రారంభమైన ఈ సినిమా మ్యాట్నీకి 74 శాతానికి పెరిగింది. సాయంత్రానికది 78 శాతం అయ్యింది. ఓ నిర్మాతగా చాలా సంతోషంగా ఉంది. శిరీష్ నటించిన 'శ్రీరస్తు శుభమస్తు' సినిమాని ఇది దాటుతుందని భావిస్తున్నా. త్వరలోనే పెద్ద సక్సెస్ మీట్ నిర్వహిస్తాం' అని అన్నారు. 'మేం అనుకున్నదే జరిగింది. శిరీష్ నటనని అందరూ ప్రశంసిస్తున్నారు. ఫలితం పట్ల చాలా హ్యాపీగా ఉన్నాం' అని చిత్ర దర్శకుడు సంజీవ్రెడ్డి అన్నారు. అల్లు శిరీష్ చెబుతూ, 'నా కెరీర్లోనే బెస్ట్ ఓపెనింగ్స్ వచ్చాయి. 'కొత్త జంట', 'శ్రీరస్తు శుభమస్తు' సినిమాల కంటే బెటర్గా ఫస్ట్ డే ఓపెనింగ్స్ వచ్చాయి. ఈ సినిమాతో వ్యక్తిగా, ఆర్టిస్టుగా నెక్ట్స్ లెవల్కి ఎదిగిన ఫీలింగ్ కలుగుతుంది. ఈ పాత్రకి బాగా కనెక్ట్ అయ్యాను. అందుకే లీనమై నటించా. ప్రతి షోకు కలెక్షన్స్ పెరుగుతూ వస్తున్నాయి. నాకు మంచి సినిమా ఇచ్చిన మధుర శ్రీధర్, మంచి థియేటర్స్ ఇచ్చి రిలీజ్ చేయించిన సురేష్బాబుకి ధన్యవాదాలు. సంజీవ్ నన్ను కొత్తగా ప్రెజెంట్ చేశాడు. అందరూ బాగున్నానని, బాగా చేశావని అంటున్నారంటే ఆ క్రెడిట్ సంజీవ్కే దక్కుతుంది. ఈ సినిమాకి వస్తున్న రెస్పాన్స్ నా గత ఏ చిత్రానికి రాలేదు. ఈ సమ్మర్లో ఫ్యామిలీస్ని ఎంటర్టైన్ చేసే ఫర్ఫెక్ట్ చిత్రమిది' అని చెప్పారు.