Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తొలి సినిమా 'ఎంతవారలైనా' చిత్రంతోనే మంచి విజయాన్ని సొంతం చేసుకున్న
నిర్మాత, నటుడు జి.సీతారెడ్డి మలి చిత్రంగా 'మేజర్ చక్రధర్' చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఇందులో ఆయన మేజర్గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తొలిసినిమా సక్సెస్తోపాటు మలి సినిమా 'మేజర్ చక్రధర్' విశేషాలను తెలియజేసేందుకు సోమవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో నటుడు, నిర్మాత జి.సీతారెడ్డి మాట్లాడుతూ,'మా రామధూత ఆర్ట్స్ బేనర్లో నిర్మించిన మొదటి చిత్రం 'ఎంతవారలైనా'. ఈనెల 17న గ్రాండ్గా విడుదలైన ఈచిత్రం ప్రేక్షకుల విశేష ఆదరణతో మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. అన్ని వర్గాల ప్రేక్షకులూ ఈ చిత్రాన్ని ఆదరించడం చాలా ఆనందంగా ఉంది. మంచి సినిమాకి ప్రేక్షకులతోపాటు మీడియా కూడా బాగా సపోర్ట్ చేస్తుందని చెప్పడానికి మా చిత్రమే నిదర్శనం. అలాగే పరిశ్రమ వర్గాల దగ్గర్నుంచే కాకుండా నా స్నేహితులు, శ్రేయోభిలాషుల దగ్గర్నుంచి అప్రిషియేట్ చేస్తూ ఫోన్స్ రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా విజయం ఇచ్చిన ధైర్యం, స్ఫూర్తితో మరో మంచి కథతో 'మేజర్ చక్రధర్'గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాను. సమాజంలోని సమస్యలపై ఓ మేజర్ ఎలా స్పందించాడు?, అతను తీసుకున్న నిర్ణయం ఏంటి అనే అంశాల సమాహారంగా ఆద్యంతం ఆసక్తికరంగా సాగే రీతిలో చిత్రకథని తయారు చేశాం. అతి త్వరలోనే సెట్స్పైకి వెళ్ళబోయే ఈచిత్రానికి సంబంధించి నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాల్ని త్వరలోనే తెలియజేస్తాం' అని చెప్పారు.