Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'కెరీర్ పరంగా నేను ఇతర హీరోయిన్లతో పోల్చుకోను. నాకు నచ్చిన పాత్రలు, నచ్చిన సినిమాలే చేస్తా. ఈ విషయంలో నాకు ఎలాంటి అసంతృప్తి లేదు' అని అంటోంది కాజల్ అగర్వాల్. 'కవచం' తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్తో కలిసి నటిస్తున్న చిత్రం 'సీత'. 'లక్ష్మీ కళ్యాణం',
'నేనే రాజు నేనే మంత్రి' తర్వాత
తేజ దర్శకత్వంలో కాజల్ నటిస్తున్న 3వ చిత్రమిది. ఈ నెల 24న
ఈ సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో కాజల్తో మీడియా జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు..
ఇందులో నటించటానికి రీజన్?
- మేజర్గా కథ బాగా నచ్చింది. బలమైన పాత్ర నాది. చాలా డిఫరెంట్గా ఉంటుంది. నటనకు స్కోప్ ఉంది. తేజ సర్ నా పాత్రని డిజైన్ చేసిన తీరు నన్ను ఆకట్టుకుంది. పైగా ఆయన సినిమాల్లో నటించేందుకు నేను ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాను. ఆయనపై నాకున్న గౌరవం అది.
'సీత' అని టైటిల్ ఎందుకు పెట్టారు?
- సీత కోణంలో ఈ సినిమా సాగుతుంది. క్రమ క్రమంగా అది జనరల్ వే లోకి వెళ్తుంది. ప్రస్తుత జనరేషన్ని ప్రతిబింబించే కథ ఇది. ఇప్పటి ట్రెండ్కి దగ్గరగా ఉంటుంది. అలాగే అన్ని రకాల ఎమోషనల్స్ ఉంటాయి. సందేశం లాంటివేమీ ఉండవు. ఒక పర్సన్కి సంబంధించి వ్యక్తిగతమైన అంశాలుంటాయి. ఇటీవల వస్తున్న సినిమాలకి భిన్నమైన కథ ఇది. ఓ కొత్త అనుభవాన్నిస్తుంది.
మీ పాత్ర నెగటివ్ షేడ్లో ఉంటుందా?
- ఇందులో సీత పాత్రలో నటించాను. నేను దేన్నైనా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటా. అదే సందర్భంలో బ్యాడ్ పర్సన్ని కాదు. మంచి మోటివేషనల్గా ఉంటా. మరి సీతలో నెగటివ్ షేడ్ ఉంటుందా? లేదా? అనేది తెరపైనే చూడాల్సిందే. ఇందులో తన ప్రయారిటీస్ అన్నీ భిన్నంగా ఉంటాయి. కాకపోతే పాత్రలో చాలా వరకు గ్రే షేడ్ ఉంటుంది. దాన్ని నేను బాగా ఎంజారు చేశాను. దాని కోసం చాలా హార్డ్ వర్క్ చేయాల్సి వచ్చింది. నా పాత్ర చాలా బలంగా ఉంటుంది. ఈ పాత్ర చేసేటప్పుడు రియల్ లైఫ్కి సంబంధించిన చాలా విషయాలు తెలుసుకున్నా.
బెల్లంకొండ శ్రీనివాస్తో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేయటానికి కారణం?
- బెల్లంకొండ శ్రీనివాస్ నైస్ పర్సన్. 'కవచం' చేయడం వల్ల ఈ సినిమాకి ఉపయోగపడింది. తను మంచి హార్డ్ వర్కర్. సినిమాలో ఆయన పాత్ర ఛాలెంజింగ్గా ఉంటుంది. అందుకోసం చాలా కష్టపడ్డారు. యువ హీరోలతో చేసినా, పెద్ద హీరోలతో చేసినా నాకు సేమ్ ఫీలింగ్. అయితే చిరంజీవి లాంటి పెద్ద హీరోలతో చేయడం గొప్ప అనుభవం. శ్రీను నాకంటే జూనియర్ అయినంత మాత్రానా డామినేట్ చేయడం, ఆటపట్టించడం వంటివి చేయను. సెట్లో ఫన్నీగా ఉంటాం. సినిమాలో మా పాత్రలు మాత్రం సమాన ప్రాధాన్యత కలిగి ఉంటాయి.
అప్పటికీ ఇప్పటికీ తేజలో మీరు గమనించిన మార్పు?
- తేజ సర్ చాలా మారారు. ఆయన చాలా టాలెంటెడ్ పర్సన్. ఆయనతో మాట్లాడుతుంటే ఏదో ఒకటి నేర్చుకోవచ్చు. కొత్త విషయాలు చెబుతారు. చాలా ఎనర్జిటిక్. 24గంటలు వర్క్ చేస్తూనే ఉంటారు. ఆయనతో 'లక్ష్మీ కళ్యాణం' తర్వాత మధ్యలో ఓ సినిమా చేయాల్సింది, కానీ కుదరలేదు. 'నేనే రాజు నేనే మంత్రి', ఆ తర్వాత ఈ సినిమా చేస్తున్నా. ఆయన సినిమాలో కథానాయికలకు మంచి ప్రాధాన్యతనిస్తారు.
ఇతర కథానాయికల్లా కమర్షియల్ చిత్రాలతోపాటు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు మీకూ చేసే ఆలోచన ఉందా?
- నేను కెరీర్ పరంగా ఎవరితో కంపారిజన్ చేసుకోను. నా దగ్గరికి వచ్చిన కథల్లో ఏది బెస్ట్ అనేది సెలక్ట్ చేసుకుంటా. లేడీ ఓరియెంటెడ్ స్క్రిప్ట్లు కూడా వచ్చాయి. కానీ నచ్చలేదు. సినిమాలో నా పాత్రకు ఎంత ప్రయారిటీ ఉందనేది ముఖ్యం. బలమైన పాత్రకు 'సీత' ఓ ఉదాహరణ అవుతుంది. బేసిక్గా నేను హైపర్గా ఉంటాను. పదిహేనేండ్ల కెరీర్లో సినిమా అనే ప్రాసెస్ని బాగా ఎంజారు చేస్తున్నా. నిరంతరం హార్డ్ వర్క్ చేస్తున్నాను. అందుకే ఈ స్థానంలో ఉన్నాను.
నిర్మాతగా మారబోతున్నట్టున్నారు?
- 'మను చరిత్ర' కోసం సమర్పకురాలిగా వ్యవహరిస్తున్నాను. నేను నిర్మాతని కాను. టీమ్కి సపోర్ట్ చేస్తున్నా. ప్రొడక్షన్ పెట్టే ఆలోచన ఉంది. కే.ఏ పేరుతో ఓ వెంచర్ ప్రారంభించాలనే ఐడియా ఉంది. ఇంకా ఫైనల్ కాలేదు. దీంతోపాటు ఎన్జీఓ కార్యక్రమాలు బాగా సాగుతున్నాయి. స్కూల్లో పిల్లలకు మధ్యాహ్నం భోజనాలు పెడుతున్నారు. నేను అక్కడికి వెళ్ళలేకపోతున్నా. కానీ అవన్నీ చూసుకునేందుకు మంచి టీమ్ ఉంది.
'భారతీయుడు 2' ఆగిపోయిందా?
- లేదు. జూన్లో తిరిగి ప్రారంభమవుతుంది. కమల్ హాసన్తో కలిసి నటించడం గ్రేట్ ఎక్స్పీరియెన్స్. 'క్వీన్' రీమేక్ 'పారిస్ పారిస్' ఎందుకు విడుదల కావడం లేదో నాకు తెలియదు. సినిమా ఎప్పుడో పూర్తయ్యింది. ప్రస్తుతం తెలుగులో శర్వానంద్తో కలిసి ఓ సినిమా చేస్తున్నా. చిత్రీకరణ పూర్తయ్యింది. అలాగే తమిళంలో జయంరవితో కలిసి ఓ సినిమా చేస్తున్నా. తెలుగులో పలు ఆసక్తికర ప్రాజెక్ట్లకు చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే ఆ వివరాలు తెలుస్తాయి. అయితే ఏ సినిమా చేసినా అందులో నా పాత్ర ప్రాధాన్యతకే ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తాను.