Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'అందరు తన వాళ్లే అనుకునే ఓ మధ్యతరగతి అమ్మాయి జీవితాన్ని సమస్యలు చుట్టుముడతాయి. ఆ సమస్యలను ఓ అజ్ఞాత వ్యక్తి పరిష్కరిస్తారు. ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరు? ఆమె కథలో మనిషి మేథస్సుకి చిక్కని సృష్టి రహస్యాలేంటనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే' అని అంటున్నారు దర్శకుడు రాజకిరణ్. నందితారాజ్, సత్యం రాజేష్ జంటగా, అశుతోష్ రాణా, ప్రసన్నకుమార్ కీలక పాత్రలు పోషిస్తున్న చిత్రం 'విశ్వామిత్ర'.
రాజకిరణ్ దర్శకత్వంలో ఫణి తిరుమలశెట్టి సమర్పణలో రాజకిరణ్ సినిమా పతాకంపై మాధవి అద్దంకి, రజనీకాంత్.ఎస్, రాజకిరణ్ నిర్మిస్తున్నారు. సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమా గురించి దర్శకుడు రాజకిరణ్ మాట్లాడుతూ,'విశ్వంలో మానవ మేధస్సుకి అందని విషయాలు చాలా ఉన్నాయి. సృష్టిలో ఏది జరుగుతుందో, ఏది జరగదో, చెప్పడానికి మనుషులు ఎవరు? ఈ సృష్టిలో ఏదైనా సాధ్యమే, ఎప్పటికీ నిలిచే సృష్టిలో మనుషులు కొంత కాలం మాత్రమే జీవిస్తారని చెప్పే ప్రయత్నమే ఈ సినిమా. వాస్తవ ఘటనల ఆధారంగా 'గీతాంజలి', 'త్రిపుర' తరహాలో థ్రిల్లింగ్ కాన్సెప్ట్తో రూపొందించాం. ఫ్యామిలీ అంతా చూడదగ్గ చిత్రమిది. బిజినెస్ పూర్తయ్యింది. సినిమా నచ్చి జీ ఛానెల్ ఫ్యాన్సీ రేటుకి శాటిలైట్ హక్కులను తీసుకోవడం సంతోషంగా ఉంది. తాజాగా ఇది సెన్సార్ పూర్తి చేసుకుని 'యు/ఏ' సర్టిఫికేట్ పొందింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సినిమాని జూన్ 14న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. ఇందులో మధ్యతరగతి అమ్మాయిగా నందిత, ఆమెకు సహాయం చేసే వ్యక్తి పాత్రలో సత్యం రాజేష్, నందిత బాస్గా అశుతోష్ రానా, ఆమె స్నేహితుడిగా ప్రసన్న నటించారు' అని అన్నారు. విద్యుల్లేఖ రామన్, చమ్మక్ చంద్ర, కార్టూనిస్ట్ మల్లిక్, జీవా, రాకెట్ రాఘవ, సి.వి.ఎల్ నరసింహరావు, ఇందు ఆనంద్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు.