Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో 'మన్మథుడు 2'రూపొందుతుంది. మనం ఎంటర్ప్రైజెస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్ పతాకాలపై నాగార్జున, పి.కిరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్ర పోర్చుగల్ షెడ్యూల్ పూర్తయ్యింది. ఈ సందర్భంగా చిత్ర బృందం తెలియజేస్తూ, 'మన్మథుడు' సినిమా స్ఫూర్తితో 'మన్మథుడు 2' చిత్రాన్ని ఓ లాఫింగ్ రైడర్గా రూపొందిస్తున్నాం. 'ఇటీవల నెల రోజులపాటు పోర్చుగల్లో భారీ షెడ్యూల్ని చిత్రీకరించాం. నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్, వెన్నెల కిషోర్, రావు రమేష్ వంటి సహనటులందరూ పాల్గొనగా పోర్చుగల్ షెడ్యూల్ పూర్తయ్యింది. అక్కడి షెడ్యూల్లో ఫన్ సన్నివేశాల్లో భాగంగా తీసిన ఫొటోలు నాగార్జున అభిమానులతో పంచుకున్నారు. ఇప్పుడివి సోషల్ మీడియాలో వైరల్అవుతున్నాయి. త్వరలోనే హైదరాబాద్లో మరో షెడ్యూల్ ప్రారంభమవుతుంది' అని తెలిపింది. లక్ష్మీ, ఝాన్సీ, దేవ దర్శిని ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: చైతన్ భరద్వాజ్, కెమెరా: ఎం.సుకుమార్, ఎడిటర్స్: ఛోటా ఎ.ప్రసాద్, బి.నాగేశ్వర్రెడ్డి.