Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తేజ, హరిణి రెడ్డి హీరో హీరోయిన్లుగా రాజేష్ కనపర్తి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'డ్రీమ్ బారు'. మాస్టర్ ఎన్. టి. రామ్ చరణ్ సమర్పణలో 7 వండర్స్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రేణుక నరేంద్ర నిర్మిస్తున్నారు. మంగళవారం ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో దర్శకుడు రాజేష్ మాట్లాడుతూ, 'ఈ కథకు తగిన కాస్టింగ్ కుదిరింది. ప్రస్తుతం టాకీ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. కంటెంట్ ఉన్న చిత్రమిది. తప్పకుండా అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నా' అని అన్నారు. 'ఇది నాకు మొదటి సినిమా. అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. మంచి కంటెంట్ ఉన్న చిత్రంతో పరిచయం అవుతున్నందుకు, సూర్య, హేమ, ధనరాజ్ లాంటి సీనియర్ నటులతో కలిసి వర్క్ చేసే అవకాశం వచ్చినందుకు హ్యాపీగా ఉంది' అని హీరో తేజ చెప్పారు. మ్యూజిక్ డైరెక్టర్ సుభాష్ ఆనంద్ చెబుతూ,'ఇందులో 4 పాటలు ఉన్నాయి. రికార్డింగ్ పూర్తయ్యింది. పాటలను చిత్రీకరించాల్సి ఉంది. త్వరలో వైజాగ్లో ప్లాన్ చేస్తున్నాం' అని తెలిపారు. చిత్ర ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వీరబాబు మాట్లాడుతూ, 'ముఖ్యమైన పని వల్ల మా నిర్మాత రాలేకపోయారు. దర్శకుడు రాజేష్ మంచి కథను తెరకెక్కిస్తున్నాడు. సాంగ్స్ని వైజాగ్లో చిత్రీకరించేందుకు ప్లాన్ చేస్తున్నాం. మిగతా అన్నీ పనులు త్వరలో పూర్తి చేసుకొని జులై నెలలో సినిమాను విడుదల చేయనున్నాం' అని చెప్పారు. సూర్య, హేమ, ధన్ రాజ్, చమ్మక్ చంద్ర, రాకింగ్ రాకేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి డిఓపి: నాని-సుభాష్ బొంతు, ఎడిటర్: బస్వ పైడి రెడ్డి, మ్యూజిక్: సుభాష్ ఆనంద్.