Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'రికమండేషన్ కంటే హార్డ్ వర్కే ముఖ్యం' అని చెబుతోంది రకుల్ ప్రీత్ సింగ్. దక్షిణాదిలో ఎంట్రీ ఇచ్చిన తక్కువ కాలంలోనే స్టార్ ఇమేజ్ని రకుల్ సొంతం చేసుకుంది. కానీ బాలీవుడ్లో మాత్రం సరైన గుర్తింపు దక్కించుకోలేకపోతుంది. 2014లో 'యారియన్' సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా ఆకట్టుకోలేకపోయింది. దీంతో నాలుగేండ్లపాటు బాలీవుడ్ వైపు చూడలేదు. గతేడాది సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి 'అయ్యారీ' చిత్రంలో నటించింది. ఈ సినిమా కూడా నిరాశ పరిచింది. తాజాగా ఆమె అజరు దేవగన్ వంటి స్టార్ హీరో సరసన అకివ్ అలీ దర్శకత్వంలో రూపొందిన 'దే దే ప్యార్ దే'లో నటించింది. రొమాంటిక్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా ఇటీవల విడుదలై పాజిటివ్ టాక్ని తెచ్చుకుంది. ఈ సందర్భంగా బాలీవుడ్లో రాణించడం పట్ల రకుల్ స్పందిస్తూ, 'బాలీవుడ్లో నాకెవరూ గాడ్ ఫాదర్ లేరు. అందుకే మంచి ఛాన్స్లను పొందడంలో ఇబ్బంది పడుతున్నా. ఒకరిచేత రికమండేషన్ చేయించు కోవడం కంటే కష్టపడి పనిచేస్తే మన పనే మరింత గౌరవాన్ని తెస్తుంది. అందుకే నా వరకు నేను హార్డ్ వర్క్ చేస్తున్నా. నాకు భాషతో సంబంధం లేదు. కానీ నా సినీ జాబితాలో గొప్ప సినిమాలుండాలని కోరుకుంటున్నా' అని అన్నారు. 'దే దే ప్యార్ దే' ఇటీవల విడుదలై రూ.50కోట్లు కలెక్ట్ చేసింది. ఈ సందర్భంగా ఆజరు దేవగన్ రకుల్ని ప్రశంసలతో ముంచెత్తారు. రకుల్ సెక్యూర్డ్ యాక్టర్ అని అన్నారు. అంతేకాదు రకుల్ బాలీవుడ్ ఫ్యూచర్ అంటూ బాలీవుడ్ మీడియా అభివర్ణిస్తుంది. దీంతో రకుల్ సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతోంది.