Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''భారత్' చిత్రంలో నాకు సంబంధించిన ఓ గెటప్ ఇందిరా గాంధీని పోలినట్టు ఉంటుంది.
భావిష్యత్లో ఆమె బయోపిక్లో నటించాలనుంది' అని అంటోంది కత్రినా కైఫ్. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో రూపొందిన 'భారత్' సినిమాలో మరోసారి సల్మాన్ సరసన కథానాయికగా నటించింది.
దిశాపటానీ, టబు, జాకీ ష్రాఫ్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా వచ్చే నెల 5న విడుదల కానుంది.
చిత్ర ప్రమోషన్లో భాగంగా కత్రినా మాట్లాడుతూ, ''భారత్'లో నేను భిన్న గెటప్లో కనిపిస్తా.
ఓ లుక్లో ఇందిరాగాంధీకి దగ్గరి పోలికలుంటాయి. అయితే అది ఇంటెన్షనల్గా పెట్టింది కాదు, అలా కుదిరిందంతే. భవిష్యత్లో ఛాన్స్ వస్తే మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పాత్రలో నటించేందుకు సిద్ధంగా ఉన్నా' అని తెలిపింది.
ఇదిలా ఉంటే, కత్రినా గతంలో 'రాజ్నీత్' అనే పొలిటికల్ థ్రిల్లర్లో నటించింది. ప్రకాష్ ఝా దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో సోనియా గాంధీని పోలిన పాత్రలో మెప్పించింది. కానీ సినిమా మాత్రం బాక్సాఫీసు వద్ద డిజాస్టర్గా నిలిచింది. కత్రినా ప్రస్తుతం అక్షరు కుమార్తో కలిసి 'సూర్యవంశీ'లో నటిస్తోంది. రోహిత్ శెట్టి దర్శత్వం వహిస్తున్న చిత్రమిది.