Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాజేంద్రప్రసాద్, ఐశ్వర్యా రాజేష్, కార్తీక్ రాజు, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రధారులుగా భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో 'కౌసల్య కృష్ణమూర్తి'(ది క్రికెటర్) చిత్రం రూపొందుతుంది. క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై కె.ఎస్.రామారావు సమర్పణలో కె.ఎ.వల్లభ నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్ పూర్తి చేసుకుంది.
ఈ సందర్భంగా కె.ఎస్.రామారావు మాట్లాడుతూ, 'తండ్రీకూతుళ్ళ మధ్య ఉండే ప్రేమా, ఆప్యాయత, అనుబంధాన్ని చాటి చెప్పే చిత్రమిది. క్రికెట్ బ్యాక్డ్రాప్ ఈ సినిమాలో ఉన్న నావెల్టీ. ఫిమేల్ క్రికెటర్గా ఐశ్వర్యా రాజేష్ ఎలా విజయం సాధించింది? తండ్రికి, దేశానికి ఎంత పేరు తెచ్చిందనేది సినిమా ప్రధాన ఇతివృత్తం. ఒక మంచి కథతో, పూర్తి గ్రామీణ నేపథ్యంలో సాగుతుంది. నటుడు రాజేష్ కుమార్తె, హాస్యనటి శ్రీలక్ష్మి మేనకోడలు ఐశ్వర్యా రాజేష్ కావడం విశేషం. వైజాగ్ రాజుగారి అబ్బాయి కార్తీక్ రాజు హీరోగా చేస్తున్నాడు. రాజేంద్రప్రసాద్ ఇందులో ముఖ్య పాత్రలో కనిపిస్తారు. 'ఆ నలుగురు', 'మీ శ్రేయోభిలాష'ి తర్వాత ఆయనకు ఇది మరో గొప్ప పాత్ర అవుతుంది. వెన్నెల కిషోర్ ఎస్ఐగా మంచి వినోదాన్ని పంచే పాత్ర పోషిస్తున్నారు. సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. జూన్ మూడోవారంలో రిలీజ్కి ప్లాన్ చేస్తున్నాం. మా బ్యానర్లో ఇది మరో మంచి సినిమా అవుతుంది' అని అన్నారు. 'లేడీ క్రికెటర్ కథాంశంతో వస్తున్న విభిన్న చిత్రమిది. ఒక మంచి సబ్జెక్ట్తో, ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్తో విలేజ్ బ్యాక్డ్రాప్లో సాగే ఈ చిత్రం అన్ని వర్గాలను అలరిస్తుంది. ఈ కథలో రైతుల సమస్యలను కూడా టచ్ చేశాం. దర్శకుడిగా నాకు ఇదెంతో సంతృప్తినిచ్చింది. క్రికెటర్ పాత్ర కోసం ఐశ్వర్యా రాజేష్ ఆరు నెలలపాటు కష్టపడి క్రికెట్ నేర్చుకొని ఈ చిత్రంలో నటించడం విశేషం. రాజేంద్రప్రసాద్ పాత్ర సినిమాకి ప్రాణం. ప్రముఖ తమిళ హీరో శివకార్తికేయన్ ఒక స్పెషల్ రోల్ చేయడం ఈ చిత్రానికి హైలైట్. మొత్తంగా మంచి అనుభూతిని పంచే చిత్రమవుతుంది' అని చిత్ర దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు తెలిపారు.