Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రభుదేవా, తమన్నా జంటగా నందితా శ్వేత, సప్తగిరి, సోనూ సూద్ ప్రధాన పాత్రధారులుగా విజరు దర్శకత్వంలో 'అభినేత్రి 2' రూపొందుతుంది. ఈ చిత్రాన్ని అభిషేక్ నామా, ఆర్. రవీంద్రన్ సంయుక్తంగా తెలుగులో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో 'రెడీ రెడీ..' అంటూ సాగే పాటని ఇటీవల విడుదల చేశారు. తాజాగా 'చక్కని పిల్లా చక్కెరబిల్లా..' అంటూ సాగే మరో పాటని విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ, 'మూడేండ్ల క్రితం వచ్చిన 'అభినేత్రి' మంచి విజయం సాధించింది. దానికి సీక్వెల్గా ఈ సినిమాని రూపొంది స్తున్నాం. ఇందులో హర్రర్ కామెడీ, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఆకట్టుకుంటాయి. దీంతోపాటు మనసుకు నచ్చే ఆహ్లాదకరమైన సన్నివేశాలు పుష్కలంగా ఉంటాయి. సినిమాలో ప్రభుదేవా, తమన్నా, నందితా శ్వేత, కోవై సరళల నటన హైలైట్గా నిలుస్తుంది. ఇటీవల విడుదలైన టీజర్, 'రెడీ రెడీ' పాటకి అద్భుతమైన స్పందన లభించింది. తాజాగా విడుదల చేసిన 'పిల్లండోరు .. చక్కని పిల్లండోరు.. కుంకుమ కలరండోరు, చక్కని పిల్లా చక్కెరబిల్లా..' పాట సైతం శ్రోతలను విశేషంగా అలరిస్తుంది. హీరోహీరోయిన్లు తమ ప్రేమని టీజింగ్ స్టయిల్లో తెలియజేసే పాట ఇది. శ్యామ్ సంగీతం అన్ని వర్గాలని అలరిస్తుంది. ఆయాంక బోస్ అందించిన విజువల్స్ పెద్ద ప్లస్ అవుతాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 31న సినిమాని విడుదల చేయనున్నాం' అని అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: శామ్ సి.ఎస్, ఎడిటింగ్: ఆంటోని.