Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రజనీకాంత్ చాలా రోజుల తర్వాత పోలీస్ పాత్రలో మెరవబోతున్నారు. ప్రస్తుతం ఏ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న 'దర్బార్'లో ఆయన పవర్పుల్ పోలీస్ ఆఫీసర్గా నటిస్తున్నారు. అంతేకాదు ఇందులో ఆయన ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఓ పాత్రలో ఎన్కౌంటర్ స్పెషలిస్ట్గా, మరో పాత్రలో సామాజిక కార్యకర్తగా కనిపిస్తారని తెలుస్తుంది. ఇటీవల విడుదలైన రజనీ పోలీస్ లుక్ విశేషంగా ఆకట్టుకుంది. సినిమాపై అంచనాలనూ పెంచింది. ఇదిలా ఉంటే, మెయిన్ విలన్గా బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టిని ఈచిత్రం కోసం ఎంపిక చేశారట. రజనీకాంత్ ఇటీవల తన సినిమాల్లో వరుసగా బాలీవుడ్ నటులను విలన్లుగా పరిచయం చేస్తున్నారు. 'కాలా' చిత్రంలో నానా పటేకర్ని, '2.0'లో అక్షరు కుమార్ని, తాజాగా సినిమాలో మరో బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టిని ఎంపిక చేయడం ఆసక్తికరంగా మారింది. అయితే ఆయన దీన్నొక సెంటిమెంట్గా భావిస్తున్నారా? లేక బాలీవుడ్ మార్కెట్ని క్యాష్ చేసుకునేందుకు వేసిన ట్రిక్కా అనేది తెలియాలి. బాలీవుడ్ నటుడు ప్రతీక్ బబ్బర్ మరో విలన్గా ఇప్పటికే ఎంపికైనట్టు తెలిసింది. నయనతార కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో నివేదా థామస్ కీలక పాత్రలో రజనీకి కూతురిగా నటిస్తుంది. యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమా ముంబయిలో భారీ షెడ్యూల్ని జరుపుకుంటుంది. కమర్షియల్ అంశాలకు సందేశాన్ని జోడించి సినిమాలు చేయడం మురుగదాస్ ప్రత్యేకత. ఇందులో కూడా అలాంటి ఓ కొత్త రకమైన సందేశాన్ని ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. కాగా సునీల్ శెట్టి ప్రస్తుతం 'పహిల్వాన్' అనే కన్నడ సినిమాలో విలన్గా నటిస్తున్నారు. ఇందులో సుదీప్ హీరో. దీంతోపాటు మలయాళంలో 'మరక్కర్: ది లయన్ ఆఫ్ ది అరేబియన్ సీ' చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. హిందీలో 'తానాజీ: ది అన్సంగ్ వారియర్', 'హేరా ఫేరి 3' చిత్రాల్లో నటిస్తున్నారు. గతంలో 2001లో వచ్చిన '12బి' అనే తమిళంలో చిత్రంలో సునీల్ శెట్టి కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత ఆయన నటించబోతున్న తమిళ సినిమా 'దర్బార్' కావడం విశేషం.