Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బాలీవుడ్ కండల వీడు సల్మాన్ ఖాన్ 'సాహో'లో మెరవబోతున్నారా?, గెస్ట్గా ఆడియెన్స్కి సర్ప్రైజ్ ఇవ్వనున్నారా? అంటే అవునంటూ బాలీవుడ్ వర్గాల నుంచి సానుకూలమైన స్పందన రావడం విశేషం. ప్రభాస్, శ్రద్ధా కపూర్ జంటగా సుజిత్ దర్శకత్వంలో 'సాహో' చిత్రం రూపొందుతుంది. యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్, విక్కీలు నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి ఇటీవలే ప్రభాస్ సర్ప్రైజ్ ఇచ్చారు. తన కొత్త లుక్ పోస్టర్ని విడుదల చేశారు. దీనికి విశేష స్పందన లభించింది. కేవలం 24 గంటల్లోనే ఎనిమిది లక్షల లైక్లను సొంతం చేసుకుంది. ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమా పోస్టర్కి ఈ స్థాయిలో లైక్లు రాలేదట. తాజాగా 'సాహో' టీమ్ ఆడియెన్స్కి థియేటర్లో భారీ సర్ప్రైజ్ ఇవ్వబోతుందని తెలుస్తుంది. ఇందులో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ని అతిథి పాత్రలో నటింపచేయాలని ప్లాన్ చేస్తుంది. దీనిపై ఇప్పటికే యూనిట్ సల్మాన్ని అప్రోచ్ అయ్యింది. ఆయన నుంచి గ్రీన్ సిగల్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తుంది. మరి సల్మాన్ ఓకే చెబుతారా? లేదా ? అనేది చూడాలి. ఇదిలా ఉంటే, సల్మాన్ ప్రస్తుతం 'భారత్'లో నటించారు. కత్రినా కైఫ్ కథానాయికగా నటించింది. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా జూన్ 5న విడుదల కానుంది. తాజాగా ఈ సినిమాలోని 'తుర్పేయా..' అంటూ సాగే మరోపాటని విడుదల చేశారు. ఇన్స్టాగ్రామ్ ద్వారా సల్మాన్ ఈ పాటని అభిమానులతో పంచుకున్నారు. ఈ సినిమాలో మొదట కత్రినా స్థానంలో ప్రియాంకని ఎంపిక చేశారు. ఆమె నిక్ జోనాస్తో పెళ్ళి కారణంగా మధ్యలోనే తప్పుకున్న విషయం విదితమే. దీనిపై పలు సందర్భాల్లో సల్మాన్ కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. తాజాగా మరోసారి స్పందించారు. 'ఈ చిత్ర ట్రైలర్ విడుదలయ్యాక కూడా ప్రియాంక నాకు ఫోన్ చేయలేదు. నిజంగానే ఏదైనా సమస్య ఉంటే ఫోన్ చేయలేకపోయినా పర్వాలేదు. ఏం జరిగినా అది మన మంచికే అనుకోవాలి. సాధారణంగా నటీనటులు సినిమా కోసం ఏదైనా వదులుకుంటారు. భర్తల్ని కూడా వదులుకున్న నటీమణులున్నారు. కానీ ప్రియాంక భర్త కోసం 'భారత్'నే వదులుకుంది' అని విమర్శించారు. ప్రస్తుతం ఆయన ప్రభుదేవా దర్శకత్వంలో 'దబాంగ్ 3'లో నటిస్తున్నారు. సోనాక్షి సిన్హా కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది.