Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విలక్షణ పాత్రలతో మెప్పించే విక్రమ్ హీరోగా అజరు జ్ఞానముత్తు దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతుంది. 7 స్క్రీన్ స్టూడియో, వయాకమ్ 18 పతాకాలపై లలిత్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. విక్రమ్ నటిస్తున్న 58వ చిత్రమిది. ఇటీవల ఈ చిత్రాన్ని ప్రకటించారు.
ఈ సందర్భంగా చిత్ర బృందం మాట్లాడుతూ, 'తాను నటించే పాత్ర ఏదైనా సరే, దానిలో పరకాయ ప్రవేశం చేసి పాత్రని రక్తికట్టించడం విక్రమ్ ప్రత్యేకత. థియేటర్లో ఆడియెన్స్ ఒక్క క్షణం కూడా దృష్టి తిప్పుకోనియకుండా సినిమాలు తీసే జ్ఞానముత్తు దర్శకత్వంలో ఈ భారీ చిత్రాన్ని 7స్క్రీన్ స్టూడియో వంటి పెద్ద బ్యానర్లో లలిత్ కుమార్ నిర్మిస్తుండటంతో ఇప్పటికే హైప్ పెరిగింది. దీని కోసం సర్వత్రా ఆసక్తి కరంగా వెయిట్ చేస్తున్నారు. దర్శకుడు జ్ఞానముత్తు గతంలో 'డిమాంటి కాలనీ', 'ఇమైకా నోడిగల్' వంటి సినిమాలని రూపొందించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు విక్రమ్ కోసం ఆయన ఓ మంచి కథ సిద్ధం చేశారు. ఆసక్తికర కథాంశంతో రాబోతున్న ఈ సినిమా ఆగస్ట్లో ప్రారంభం కానుంది. వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయనున్నారు. భిన్నమైన కథాంశంతో యాక్షన్ థ్రిల్లర్గా భారీ బడ్జెట్తో నిర్మించే ఈ చిత్ర ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి. తెలుగు, తమిళం, హిందీలో ఈ సినిమా తెరకెక్కనుంది' అని చెప్పింది.