Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జయప్రద, పూర్ణ, సాక్షి చౌదరి ప్రధాన పాత్రధారులుగా సూర్య ఎమ్.ఎస్.ఎన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ' సువర్ణ సుందరి'. ఎస్.టీమ్ పిక్చర్స్ పతాకంపై ఎమ్.ఎల్. లక్ష్మి నిర్మిస్తున్న ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుని విడుదలకు రెడీగా ఉంది. ఈ సందర్భంగా నిర్మాత లక్ష్మీ మాట్లాడుతూ, 'సినిమా సెన్సార్ పూర్తి చేసుకుని 'యు/ఎ' సర్టిఫికేట్ని పొందింది. ఈ నెల 31వ తేదీన తెలుగు, కన్నడలో విడుదల చేయనున్నాం. ఇప్పటికే విడుదలైన థియేట్రికల్ ట్రైలర్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమాపై హైప్ని పెంచింది. దర్శకుడు సూర్య ఈ సినిమాని అత్యద్భుతంగా తీర్చిదిద్దారు. బడ్జెట్ని మించి మంచి నాణ్యమైన ఔట్ పుట్ రావటం సినిమా కచ్చితంగా సక్సెస్ అవుతుందన్న నమ్మకం పెరిగింది' అని అన్నారు. 'సూపర్ నేచురల్ థ్రిల్లర్గా సాగే చిత్రమిది. 'చరిత్ర భవిష్యత్ని వెంటాడుతుంది' అన్న క్యాప్షన్ ఆకట్టుకుంటుంది. ఇలాంటి కంటెంట్ ఉన్న సినిమాని రూపొందించినందుకు గర్వంగా ఉంది. స్టోరీ డిమాండ్ మేరకు క్వాలిటీతో రూపొందించాం. సినిమా చూసి సెన్సార్ సభ్యులు అభినందించారు. ప్రారంభం నుంచి చివరి వరకు థ్రిల్లింగ్గా ఉందన్నారు. కచ్చితంగా అన్ని వర్గాలను ఆకట్టుకునే చిత్రమవుతుంది' అని చిత్ర దర్శకుడు సూర్య చెప్పారు. ఇంద్ర, రామ్, సాయికుమార్, కోటాశ్రీనివాసరావు, ముక్తర్ఖాన్, నాగినీడు, సత్యప్రకాష్, అవినాష్ నటిస్తున్న ఈ చిత్రానికి మ్యూజిక్: సాయికార్తీక్, ఆర్ట్ : నాగు, డి.ఓ.పి: ఎల్లుమహంతి, ఎడిటర్: ప్రవీణ్పూడి.