Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మాజీ సీఎం డా||వైఎస్ రాజశేఖర్రెడ్డి చేపట్టిన పాదయాత్ర నేపథ్యంగా ఇటీవల 'యాత్ర' చిత్రం రూపొందింది. మహి వి రాఘవ్ దర్శకత్వం వహించగా, వైఎస్ పాత్రలో మలయాళ నటుడు మమ్ముట్టి నటించారు. ఫిబ్రవరిలో విడుదలైన సినిమా మంచి ప్రశంసలందుకుంది. కానీ బాక్సాఫీసు వద్ద మిశ్రమ స్పందనని రాబట్టుకుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి సీక్వెల్గా 'యాత్ర 2' రాబోతుందట. ఈ సీక్వెల్ని తెరకెక్కించేందుకు దర్శకుడు రాఘవ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ తరపున వైఎస్ జగన్ భారీ మెజార్టీతో గెలుపొందిన విషయం విదితమే. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని జగన్కి దర్శకుడు రాఘవ శుభాకాంక్షలు తెలియజేస్తూ 'యాత్ర 2' అనే టైటిల్ని ప్రస్తావించారు. నిర్మాత శశి రెడ్డి సైతం 'యాత్ర 2' అని ట్విట్టర్లో పేర్కొన్నారు. దీంతో త్వరలోనే 'యాత్ర 2' సినిమాకి రంగం సిద్ధం కానుందని తెలుస్తోంది. అయితే ఈసారి జగన్ చేపట్టిన పాదయాత్ర ప్రధానంగా సినిమాని తీయనున్నారట. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.