Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తాప్పి ప్రధాన పాత్రధారిణిగా అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో 'గేమ్ ఓవర్' చిత్రం రూపొందుతుంది. వై నాట్ స్టూడియోస్ పతాకంపై ఎస్.శశికాంత్, చక్రవర్తి రామచంద్ర సంయుక్తంగా తెలుగు, తమిళంలో నిర్మిస్తున్నారు. ఈ సినిమా తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ, 'సినిమా సెన్సార్ పూర్తి చేసుకుని 'యు/ఏ' సర్టిఫికేట్ని పొందింది. ప్రపంచ వ్యాప్తంగా జూన్ 14 న విడుదల చేయనున్నాం. ఓ సరికొత్త కథ, కథనాలతో తెలుగు, తమిళ భాషలలో రూపొందిన ఈ చిత్రం మా బ్యానర్లో గతంలో వచ్చిన 'లవ్ ఫెయిల్యూర్', 'గురు' విజయాల సరసన నిలుస్తుందని నమ్ముతున్నాం' అని అన్నారు. ''గేమ్ ఓవర్' చిత్ర కథ విన్నప్పుడే సరికొత్తగా ఉందని అనిపించింది. విజయం సాధించే చిత్రం అనిపించింది. 'ఆనందో బ్రహ్మ' తర్వాత నా చిత్రాలపై ప్రేక్షకులు పెట్టుకున్న నమ్మకాన్ని ఈ చిత్రం వమ్ము చేయదని చెప్పగలను' అని తాప్సీ తెలిపారు. చిత్ర దర్శకుడు మాట్లాడుతూ, 'ఇది తెలుగు ఆడియెన్స్ని విశేషంగా ఆకట్టుకునే చిత్రమవుతుంది' అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: రోన్ ఏతాన్ యోహాన్, ఎడిటర్: రిచర్డ్ కెవిన్, కెమెరా: ఎ.వసంత్, ఆర్ట్: శివశంకర్.