Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'చిన్నప్పట్నుంచి నేను అబ్బాయిగా పెరిగాను. మా నాన్న నన్ను టామ్బారులానే పెంచారు' అని అంటోంది దిశాపటానీ. ఆమె ప్రస్తుతం 'భారత్' చిత్రంలో నటిస్తుంది. సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ జంటగా అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. వచ్చే నెల 5న విడుదల కానుంది. ఈ సందర్భంగా దిశా మాట్లాడుతూ, 'సల్మాన్ ఖాన్తో కలిసి నటించడం చాలా హ్యాపీగా ఉంది. అది మర్చిపోలేని అనుభూతి. ఇది నా కెరీర్లో మైలురాయిగా నిలిచిపోయే చిత్రమవుతుంది' అని తెలిపింది. టైగర్ ష్రాఫ్ ప్రేమలో ఉన్నారనే వార్తలపై ఆమె స్పందిస్తూ, 'టైగర్, నేను బెస్ట్ ఫ్రెండ్స్. మేం లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం. మాకంటూ ఓ గోల్ ఉంది. వర్క్ పట్ల నిబద్ధతగా ఉంటాం. టైగర్ సున్నితమైన వ్యక్తి. ఆయనలో ఆ లక్షణం నాకిష్టం. ఇండిస్టీలో ఆయన తప్ప నాకు మరే ఫ్రెండ్స్ లేరు. అయితే చిన్నప్పట్నుంచి నేనో అబ్బాయిలా పెరిగా. ఆ తర్వాత నాపై నాకు నమ్మకం కలిగింది. జుట్టు పెంచడం ప్రారంభించా' అని తెలిపింది. ఇదిలా ఉంటే ఇటీవల దిశాకి 'మర్డర్ 4'లో నటించే ఛాన్స్ వచ్చిందట. అందులో ఇంటిమేట్ సీన్స్లో నటించాల్సి ఉంది. టైగర్ ష్రాఫ్ అభ్యంతరం చెప్పడంతో దిశా ఈ సినిమాని వదులుకున్నట్టు మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.