Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'నాతో ఎంజారుమెంట్ మామూలుగా ఉండదు, ఒక్కొక్కడికి.. చూస్తారుగా..' అని అంటోంది సమంత. ఆమె ప్రస్తుతం నటిస్తున్న చిత్రం 'ఓ బేబీ'. నందినిరెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో నాగశౌర్య హీరోగా నటిస్తున్నారు. లక్ష్మి ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. సమంత ఇందులో గాయనిగా నటిస్తున్నారు. తాజాగా శనివారం ఈ చిత్ర టీజర్ని
విడుదల చేశారు. 'నా పేరు సావిత్రి, చిన్నప్పుడు అందరు నన్ను భానుమతిలా ఉన్నావనేవాళ్ళు' అంటూ నటి లక్ష్మి చెప్పే డైలాగ్, ఆ వెంటనే సమంత గాయనిగా పాటపాడటం, 'మీకు బారు ఫ్రెండ్ ఎవరూ లేరు కదా!' అని సమంతని నాగశౌర్య అడగ్గా, 'హా.. నేను మంచి వయసులో ఉన్నప్పుడే మా ఆయన పోయాడు. అప్పటికే నానిగాడు పుట్టేశాడు. ఇంకా పెళ్ళి, పెటాకులు ఎందుకని వాడిని పెంచి, పెద్ద చేశా. వాడు పెళ్ళి చేసుకుని ఇద్దర్ని కన్నాడు. వాళ్ళు కూడా పెళ్ళీడుకొచ్చేశారు, నాకు వయసు అయిపోయింది' అని సమంత బదులివ్వడం, దానికి శౌర్య నవ్వుతూ 'మీరు సింగింగ్తోపాటు యాక్టింగ్ కూడా చేయాల్సింది' అనడం, చివర్లో 'నాతో ఎంజారుమెంట్ మామూలుగా ఉండదు, ఒక్కొక్కడికి, చూస్తారుగా..' అని సమంత సెటైరికల్గా చెప్పడం టీజర్లో హైలైట్గా నిలిచింది. టీజర్ ఆద్యంతం వినోదాత్మకంగా సాగుతూ ఆసక్తిని క్రియేట్ చేస్తుంది. కొరియన్ సినిమా 'మిస్గ్రానీ'కిది రీమేక్గా రూపొందుతుంది.