Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అల్లు అర్జున్ సినిమాల కోసం ఆయన ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. దాదాపు ఏడాదికి పైగా ఆయన్నుంచి ఒక్క సినిమా కూడా రాకపోవడం అందుకు కారణం. ఇటీవల తన పుట్టిన రోజుని పురస్కరించుకుని వరుసగా బ్యాక్ టూ బ్యాక్ మూడు ప్రాజెక్ట్లని ప్రకటించారు. దీంతో తనకు వచ్చిన గ్యాప్ని భర్తీ చేయాలని, వరుసగా ఫ్యాన్స్ని ఎంటర్టైన్ చేయాలని భావిస్తున్నారట. త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ప్రారంభమై రెగ్యులర్ షూటింగ్ని జరుపుకుంటోంది. ఇప్పటికే ఇది మొదటి షెడ్యూల్ని పూర్తి చేసుకుంది. త్వరలో రెండో షెడ్యూల్కి సిద్ధమవుతుందట. ఈ నెల 27 నుంచి రెండో షెడ్యూల్ని హైదరాబాద్లో ప్లాన్ చేశారట. ఇందులో బన్నీతోపాటు కథానాయికగా పూజాహెగ్డే, ఇతర ప్రధాన తారాగణం నటించే అవకాశం ఉంది. ఫ్యామిలీకి సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించనున్నారని తెలుస్తుంది. తండ్రీకొడుకుల మధ్య అనుబంధం, భావోద్వేగాలు, ఫ్యామిలీ సెంటిమెంట్ ప్రధానంగా సినిమా సాగుతుందని తెలుస్తుంది. ఇక 'డీజే' తర్వాత ఇందులో బన్నీ, పూజా హెగ్డే కలిసి నటిస్తున్న విషయం విదితమే. టబు తల్లి పాత్రలో కనిపించనున్నారట. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్, హారికా అండ్ హాసిని క్రియేషన్స్ పతాకాలపై అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి 'అలకనంద' అనే టైటిల్ వినిపిస్తుంది. బన్నీ దీంతోపాటు సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా, వేణు శ్రీరామ్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు. సుకుమార్ సినిమా కూడా వచ్చే నెలలో ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందులో రష్మిక మందన్నా కథానాయికగా ఫైనల్ అయిన విషయం విదితమే.